స్మార్ట్ సిటీల జాబితా ప్రకటించిన వెంకయ్య: ఏపీలో 3, టీలో 2 నగరాల ఎంపిక
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 100 ఆకర్షణీయ నగరాల(స్మార్ట్ సిటీ) జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు విడుదల చేశారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకయ్య నాయుడు జాబితాను ప్రకటించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం 98 నగరాల్లో 13 కోట్ల జనాభా ఉందని తెలిపారు. రాబోయే ఆరేళ్లలో ఆకర్షణీయ నగరాల అభివృద్ధి కోసం రూ.3లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
ఆకర్షణీయ నగరాల కోసం ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా 13 నగరాలు ఎంపిక చేసినట్లు చెప్పారు. తమిళనాడులో12, మధ్యప్రదేశ్లో 7, గుజరాత్, కర్ణాటక నుంచి 6 నగరాలు, ఆంధ్రప్రదేశ్లో 3, బీహార్లో 3 నగరాలను ఎంపిక చేసినట్లు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలకు ఈ జాబితాలో చోటు దక్కింది. కాగా, నగరాల పేర్ల ప్రతిపాదనకు జమ్ముకశ్మీర్ సమయం అడిగిందని తెలిపారు.
ప్రస్తుతం 100 స్మార్ట్ నగరాలకు రూ. 48వేల కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ప్రతీ స్మార్ట్ సిటీకి ఐదేళ్ల కాలంలో ప్రతీ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులను కేటాయించనుంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications