గ్రూప్ 1 మెయిన్స్ పై ఊహించని ట్విస్ట్.. హైకోర్ట్ తీర్పు?
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై నేడు తుది తీర్పు వెలువడుతుందని ఆశించిన వేలాది మంది అభ్యర్థుల ఆశలు నెరవేరలేదు. హైకోర్టు నుంచి ఊహించని ట్విస్ట్ ఎదురవడంతో తీర్పు మరోసారి వాయిదా పడింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలపై గత కొంతకాలంగా న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. మూల్యాంకనంలో లోపాలు జరిగాయని, మార్కుల కేటాయింపులో పారదర్శకత లేదని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది.
సింగిల్ బెంచ్ తీర్పులో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం (రీ-వాల్యుయేషన్) చేయాలని ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే అభ్యర్థుల్లో ఆశలు చిగురించగా, ప్రభుత్వం మరియు TSPSC ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, TSPSCలు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించాయి.

డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన రీ-వాల్యుయేషన్ ఆదేశాలపై స్టే విధించింది. అయితే నియామకాలు తుది తీర్పుకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ స్టే నేపథ్యంలో ప్రభుత్వం గ్రూప్-1 నియామక ప్రక్రియను కొనసాగించింది. ఇప్పటికే ఈ పరీక్ష ద్వారా ఎంపికైన 562 మందికి నియామక పత్రాలు కూడా అందజేసింది.
అయితే ఈ నియామకాలు కోర్టు తుది తీర్పుపై ఆధారపడి ఉండటంతో, ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లోనూ, కేసు వేసిన అభ్యర్థుల్లోనూ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ కేసుపై నేడు తుది తీర్పు వెలువడుతుందని భావించిన అభ్యర్థులు ఉదయం నుంచే హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురు చూశారు. గురువారం ఈ కేసును విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్, తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని లాయర్లకు తెలియజేసి, తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
కానీ అనూహ్యంగా తీర్పు కాపీ సిద్ధం కాలేదని డివిజన్ బెంచ్ వెల్లడించడంతో విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. దీంతో నేడు తీర్పు వస్తుందన్న అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ భవితవ్యాన్ని నిర్ణయించే కీలక తీర్పు కోసం అభ్యర్థులు మరోసారి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫిబ్రవరి 5న వెలువడే తీర్పుతో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై స్పష్టత రావడంతో పాటు, ఇప్పటికే ఇచ్చిన నియామకాలు కొనసాగుతాయా? లేదా తిరిగి మూల్యాంకనం జరుగుతుందా? అన్న టెన్షన్ కొనసాగుతోంది
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications