టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ దాడి -మందిరం పేరుతో చందాల దందాలన్న ధర్మారెడ్డి వ్యాఖ్యలతో..
తెలంగాణలో క్రమంగా బలపడుతోన్న బీజేపీ.. ఇప్పుడు ఏకంగా అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిదుల్ని ఫిజికల్ గానూ టార్గెట్ చేస్తోంది. అయోధ్యలో రామమందిరంపై అనూహ్య వ్యాఖ్యలు చేసినందుకుగానూ హన్మకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి(పరకాల నియోజకవర్గం) ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడికి దిగారు. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. అయోధ్యలో రామ మందిరానికి విరాళాల సేకరణపై ధర్మారెడ్డి విమర్శలు చేయడం ఈ పరిణామానికి దారి తీసింది..

బీజేపీ చందాల దందా..
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పేరుతో బీజేపీ నేతలు విచ్చలవిడిగా చందాలు వసూలు చేస్తున్నారని, రాముడి గుడి అంటూ బీజేపీ నేతలు సేకరిస్తోన్న విరాళాలకు అకౌంటబిలిటీ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం పరకాలలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బీజేపీ, అయోధ్య ఆలయానికి విరాళాలపై ధర్మారెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు...

పటేల్ విగ్రహం కట్టారు కదా..
''హిందువులంటే బీజేపీ పార్టీవాళ్లేనా? మేమూ హిందులమే. బీజేపీ.. దేవుని పేరుతో అకౌంటబులిటీ లేకుండా డబ్బులు వసూలు చేస్తోంది. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో లెక్కలు చెప్పగలరా? ఒక తెలంగాణ రాష్ట్రంలోనే వెయ్యి కోట్లు వసూలు చేస్తే.. 29 రాష్ట్రాల్లో రూ. 29 వేలకోట్లు ఏం చేస్తారు? గుజరాత్లోని నర్మదా నదీ తీరంలో వల్లభభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి వేలకోట్లు వెచ్చించిన బీజేపీ వాళ్లు.. ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముడి గుడిని నిర్మించలేరా?'' అని ధర్మారెడ్డి వ్యాఖ్యానించగా బీజేపీ నేతలు ప్రతిదాడికి దిగారు..

చల్లాకు కడియం పరామర్శ
అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం కోసం నిధుల సేకరణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు రాళ్లతో విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ కార్యకర్తలను పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం హన్మకొండలోని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వెళ్లారు. బీజేపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన వస్తువులను కడియం పరిశీలించారు. కొద్ది రోజుల కిందట టీఆర్ఎస్ కే చెందిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. 'భద్రాద్రి రాముడికి కాకుండా అయోధ్య ఆలయానికి విరాళాలు ఇవ్వడమేంట'న్న వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications