వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారేం చేస్తారో చంద్రబాబు అదే చేస్తారు: ఓటుకు నోటుపై హరిబాబు, హోదాపై..

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఓటుకు నోటు కేసు పైన ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, విశాఖ పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు గురువారం నాడు స్పందించారు. ఆయన చిత్తూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కొనే వారంతా ఏం చేస్తారో ఈ కేసులో నిందితులు కూడా అదే చేస్తారన్నారు.

పవన్ వద్ద ఫుల్‌స్టాప్: మోడీ కదలిక వెనుక 2 కారణాలుచట్టం కూడా తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. హోదా గురించి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రానికి చేయని విధంగా కేంద్రం ఏపీకి సాయం చేస్తోందని చెప్పారు. ఏపీకి 8 జాతీయ సంస్థలు, రక్షణ సంస్థలు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలను కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు.

Haribabu responds on Cash for Vote and Special Status to AP

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చర్చిస్తోందని తెలిపారు. అలాగే, రెవెన్యూ లోటు కింద రూ.3,397 కోట్ల రాష్ట్రానికి ఇచ్చారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయని కేంద్రం ఆలోచిస్తోందని చెప్పారు. హోదాకు బదులుగా ఏపీకి కేంద్రం అంతకుమించి నిధులు ఇస్తుందన్నారు. బీజేపీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు.

English summary
BJP MP Haribabu responds on Cash for Vote and Special Status to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X