గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కు ప్రమాదం
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. బండారు దత్తాత్రేయ కాన్వాయ్ ఆదివారం రాత్రి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఆర్జిఏఐ) విమానాశ్రయం సమీపంలో ప్రమాదానికి గురైంది. గవర్నర్ హైదరాబాద్ నగరం నుంచి హర్యానాకు బయల్దేరారు. తన కాన్వాయ్లో విమానాశ్రయానికి వెళుతున్న సమయంలో రాత్రి 7:15 గంటలకు ఈ సంఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి హర్యానా వెళ్లేందుకు దత్తాత్రేయ శంషాబాద్ విమానాశ్రయం బయల్దేరారు. కిషన్గూడ ట్రంపెట్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే.. ఓ కారు అకస్మాత్తుగా గవర్నర్ కాన్వాయ్ మధ్యలోకి వచ్చింది.

ఈ క్రమంలో కాన్వాయ్లోని వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో కాన్వాయ్లోని మూడు వాహనాలు అదుపుతప్పి ఒకదానితో ఒకటి ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో 3 వాహనాలు ధ్వంసం కాగా, భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.
కాగా, సర్ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తి తన కారుతో గవర్నర్ కాన్వాయ్లోకి వచ్చినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గవర్నర్ ప్రధాన వాహనం, దానితో పాటు ఉన్న BP వాహనం సకాలంలో బ్రేకులు వేయగలిగాయి. అయితే, వెనుక ఉన్న ప్రోటోకాల్ ఇన్నోవా సకాలంలో ఆగి, BP వాహనాన్ని ఢీకొట్టింది. ఇన్నోవా వెనుక ఉన్న ఎస్కార్ట్ వాహనం విజయవంతంగా బ్రేకులు వేయగా.. అయితే కాన్వాయ్లోని అంబులెన్స్ ఎస్కార్ట్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కాన్వాయ్లోని మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ, ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గవర్నర్ దత్తాత్రేయ క్షేమంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications