తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక: హైదరాబాద్లో భారీ వర్షం, ఈదురుగాలుల బీభత్సం
హైదరాబాద్: తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడిపోతున్న హైదరాబాద్ నగర ప్రజలపై వరుణుడు కరుణ చూపాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్మేశాయి. ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరం చల్లబడటంతో సిటీ వాసులకు తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభించినట్లయింది.
హైదరాబాద్ నగరంలోని కుత్భూల్లాపూర్, మియాపూర్, చందానగర్, కూకట్పల్లి, నిజాంపేట్, తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిశాయి. సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్పల్లి, బషీరాబాద్ తోపాటు తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఊదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది.

హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు జిల్లలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుముమెరులతో కూడిన భారీ వర్షం పడింది. మానుకొండూర్, హుజూరాబాద్, పెద్దపల్లి, మల్యాల, వేములవాడ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షా కురిసింది.
సీఎం రేవంత్ సభ రద్దు
సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్ జనజాతర సభ కోసం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన టెంట్ల కుప్పకూలాయి. ఈదురుగాలుల ధాటికి కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. ఆ సమయంలో టెంట్ల కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షం, ఈదురుగాలల బీభత్సంతో సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
భారీ వర్షాలు: తెలంగాణ ప్రజలకు ఐఎండీ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50కిలో మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. రాగల రెండు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
సోమవారం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి/గాలి విచ్చిన్నతి కొనసాగింది. మంగళవారం కూడా తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
-
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
అక్కడ మంచు కరిగితే.. ఇక్కడ వర్షాలు ఎందుకు పెరుగుతున్నాయి? -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!











Click it and Unblock the Notifications