వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ బోర్డుపై హైకోర్టు గుస్సా : విద్యార్థుల జీవితంతో ఆడుకోవడం ఏంటని ప్రశ్న

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో బోర్డు అవలంభించిన నిర్లక్ష్య వైఖరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఏంటని ప్రశ్నించింది. ఇంటర్ పరీక్ష ఫలితాల రీ వాల్యుయేషన్‌పై నిర్ణయం తెలుపాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారించి .. ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అలా ఎలా ?
ఇంటర్ ఫలితాల్లో 3 లక్షల మంది వరకు ఎలా ఫెయిల్ అవుతారని ప్రశ్నించింది. విద్యార్థుల, తల్లిదండ్రుల డిమాండ్ మేరకు రీ వాల్యుయేషన్ పై బోర్డు నిర్ణయం తెలుపాలని హైకోర్టు ధర్మాసనం కోరింది. విద్యార్థుల పునర్ మూల్యంకనం కోసం ఎంత సమయం పడుతోందని ప్రశ్నించింది. మొత్తం విద్యార్థుల ఫలితాలు వెల్లడించేందుకు నెలరోజుల సమయం పడితే .. 3 లక్షల మంది విద్యార్థుల రీ వాల్యుయేషన్ కు రెండు నెలలు ఎలా పడుతుందని నిలదీసింది.

highcourt serious on inter board

అన్యాయమే ?
అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన జ్యుడీషియల్ విచారణతో విద్యార్థులకు న్యాయం జరగదని హైకోర్టు అభిప్రాయపడింది. విద్యార్థులు ఏడాది నష్టపోకుండా .. చేపట్టే చర్యలను వివరించాలని ఇంటర్ బోర్డును కోరింది. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు .. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

English summary
The High Court was angry over the ignorant attitude adopted by the Board in the inter-agency results. Questioning the student's future. to issue a decision on re-valuation of inter-test results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X