ప్రభాస్ పిటిషన్ పై హైకోర్టు నిర్ణయమేంటో తెలుసా?
హైదరాబాద్ : సినీ నటుడు ప్రభాస్ హైకోర్టు మెట్లెక్కారు. తనకు సంబంధించిన గెస్ట్హౌజ్ సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ బుధవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి బదిలీ చేసింది.
హైదరాబాద్ శివారు, గోల్కోండ ప్రాంతంలోని రాయదుర్గంలో పైగా భూములకు సంబంధించి కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. అయితే అవి ప్రభుత్వ భూములని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈనేపథ్యంలో ఆ భూముల్లో ఉన్న కట్టడాలను రెవెన్యూ అధికారులు మంగళవారం కొంతమేర కూల్చివేశారు. అక్కడే ప్రభాస్ కు చెందిన గెస్ట్హౌజ్ ఉంది. ఆ సమయంలో ప్రభాస్ మనుషులు ఎవరూ లేకపోవడంతో సీజ్ చేశారు అధికారులు.

రెవెన్యూ అధికారుల చర్యలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ప్రభాస్. గెస్ట్హౌజ్ సీజ్ చేసే విషయంలో అధికారులు నిబంధనలు పాటించలేదని.. నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడం సరికాదని ఆయన తరపు లాయర్ వాదించారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఈ వివాదం చాలామందికి చెందిన అంశంగా భావించి ప్రభాస్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో గురువారం నాడు ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశముంది.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications