ఎక్కడున్నా శోభాయాత్రకు హాజరు: హిమాచల్ గవర్నర్ హోదాలో బండారు: తమిళిసైతో భేటీ
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం హైదరాబాద్ కు చేరుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఆ రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన స్వరాష్ట్రానికి వచ్చారు.
వినాయక విగ్రహాల శోభాయాత్రలో పాల్గొన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నగరంలోని మొజాంజాహి మార్కెట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాల స్వాగత కార్యక్రమానికి గవర్నర్ హోదాలో హాజరయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతకుముందు- ఆయన రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను మర్యాదపూరకంగా కలిశారు. శాలువ కప్పి సన్మానించారు. వారిద్దరి మధ్య సుమారు 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. హైదరాబాద్ గణేష్ నిమజ్జనం శోభాయాత్రతో తనకు ఉన్న అనుబంధాన్ని దత్తాత్రేయ ఆమెతో పంచుకున్నారు. తాను ఎక్కడ ఉన్నా శోభాయాత్రకు తప్పకుండా హాజరవుతానని చెప్పారు. ఈ కారణంతోనే తాను గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే హైదరాబాద్ కు బయలుదేరి రావాల్సి వచ్చిందని అన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications