టీ మంత్రి నాయినికి అస్వస్థత, సాయంపై కోదండ
అర్హుల జాబితాలో లేకుంటే సంప్రదించవచ్చు: జేఏసీ
అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఆర్థికసాయం అందించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 469 మంది అర్హుల జాబితాను తయారు చేశారు.
ఈ మేరకు జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... ఆర్థిక సాయం జాబితాలో లేని అర్హులెవరైనా ఉంటే జేఏసీని సంప్రదించవచ్చని చెప్పారు. అర్హులైన కొన్ని కుటుంబాల పేర్లు జాబితాలో లేవన్నారు. మొత్తం ఆరువందలకు పైగా అమరవీరుల కుటుంబాలు ఉన్నాయని, తమ వద్ద ఉన్న ఆ సమాచారాన్ని త్వరలో హోంమంత్రి అందిస్తామని కోదండరాం తెలిపారు.
తెలంగాణలో కరెంట్ కోతలు
తెలంగాణలో కరెంట్ కోతలు వేసవి కష్టాలను తలపిస్తున్నాయి. అధికారిక, అనధికారిక పవర్ కట్తో అన్ని వర్గాల వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రైతులు, చిన్న తరహా నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాలు వెక్కిరిస్తున్నాయి.