Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఊరేళ్తున్నాం.. డబ్బు, నగలు తీసుకెళ్లాం! దొంగలకు ఇంటి యజమాని నోట్!!

హైదరాబాద్ నగరం నుంచి పండగలు జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళ్లిన సమయంలో ఇక్కడి నివాసాల్లో దొంగలు తమ చేతివాటాను చూపిస్తున్న విషయం తెలిసిందే. సొంతూళ్లకు పండగల కోసం వెళితే.. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారం, నగలు దోచేస్తుంటారు. ఈ నేపథ్యంలో పండగలకు సొంతూళ్లకు వెళ్లే నగర ప్రజలకు పోలీసులు పలు సూచనలు కూడా చేశారు.

అయితే, తాజాగా, సంక్రాంతి పండగకు వెళ్లిన ఓ ఇంటి యజమాని తన ఇంటి తలుపునకు ఓ నోట్ రాసి పెట్టి వెళ్లాడు. అది కూడా దొంగలనుద్దేశించి కావడం గమనార్హం. తాము సంక్రాంతికి ఊరెళ్తున్నామని.. తమ ఇంట్లో ఏమీ లేవని దొంగలకు చెప్పాడు. అనవసరంగా దొంగతనానికి వచ్చి ప్రయాస పడవద్దని సూచించాడు.

Homeowner writes note to thieves claiming they took money and jewelry

'మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి' అని పేపర్‌పై రాసి డోర్‌కు అంటించారు సదరు యజమాని. అయితే, ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగలకు ఇలాంటి నోట్ రాసిన యజమాని వ్యవహారంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

హైదరాబాద్ నగరం నుంచి సంక్రాంతి పండకు తమ సొంతూళ్లకు వెళ్లే నగర ప్రజలకు ఇప్పటికే పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు సగం నగర జనాభా సొంతూళ్లకు వెళ్లిన నేపథ్యంలో పోలీసులు కూడా రాత్రి సమయంలో గట్టి పహారా కాస్తున్నారు. దొంగలు పెద్ద ఎత్తున దోపిడీలకు పాల్పడే అవకాశం ఉండటం పోలీసులు అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టారు. అంతర్రాష్ట దొంగల ముఠాలు ఏమైనా రంగంలోకి దిగాయా? అనేదానిపై దృష్టి సారించారు. దోపిడీ దొంగల పని పట్టేందుకు నగర పోలీసులు కూడా అన్ని విధాలుగా సిద్ధమయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+