Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

న్యాయం చేయండి: కలెక్టర్, ఎస్పీలను కలిసిన ప్రణయ్ భార్య అమతృ, ఫ్యామిలీ

నల్గొండ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కుటుంబసభ్యులు పోలీసులను కోరారు. ప్రణయ్ హత్య కేసులో ఏడుగురు నిందితులను మంగళవారం ఎస్పీ రంగనాథ్ మీడియా ఎదుట ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బుధవారం ప్రణయ్ భార్య అమృత వర్షిణి, అతని తల్లిదండ్రులు, సోదరుడు.. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ రంగనాథ్‌లను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చూడాలని కోరారు.

Honour killing: Pranay family meets SP

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు హామి ఇచ్చినట్లు తెలిసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సెప్టెంబర్ 14న ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద ప్రణయ్‌ను సుభాష్ శర్మ అనే కిరాయి హంతకుడు కత్తితో నరికి చంపిన విషయం తెలిసిందే. అమృత తండ్రే ఈ హత్య చేయించడం గమనార్హం. నిందితులందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+