తెలంగాణ టాప్: కేక పుట్టిస్తున్న లెక్కలు!

దేశ వ్యవసాయ రంగ రికార్డులలో తెలంగాణ మరోమారు అగ్రగామిగా నిలిచింది. 2025-26 యాసంగి (రబీ) సీజన్‌లో వరి సాగు విస్తీర్ణంతో పాటు ధాన్యం కొనుగోళ్లలోనూ దేశంలోనే తెలంగాణ అగ్రస్థానాన్ని కైవసం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా సాగైన మొత్తం యాసంగి వరి విస్తీర్ణంలో సగానికి పైగా వాటా ఒక్క తెలంగాణదే కావడం గమనార్హం. రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించిన నివేదిక ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 59.90 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది.

యాసంగి వరి సాగులో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు (30.76 లక్షల ఎకరాలు), ఆంధ్రప్రదేశ్ (17.29 లక్షల ఎకరాలు) తెలంగాణ దరిదాపుల్లో కూడా నిలవలేకపోయాయి. సాధారణంగా నీటి కొరత కారణంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు యాసంగిలో వరి సాగుకు వెనుకాడుతుండగా, తెలంగాణ మాత్రం ఇందుకు భిన్నంగా దూసుకుపోతోంది. ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా నీటి లభ్యత, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, సన్న వడ్లకు ప్రత్యేక బోనస్, రైతుభరోసా వంటి విప్లవాత్మక పథకాల అండతో తెలంగాణ రైతాంగం అన్నపూర్ణగా మారి దేశానికే బువ్వ పెడుతోంది.

How Telangana Became India s Top Rabi Rice Producer Beating Andhra Pradesh And Tamil Nadu Combined

ఖరీఫ్, రబీ కలిపితే దేశంలోనే రెండో స్థానం

ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌తో పోలిస్తే చాలా రాష్ట్రాల్లో యాసంగి సాగు నామమాత్రంగానే (అతిస్వల్పం) ఉంటోంది. చిత్రంలోని అధికారిక గణాంకాల ప్రకారం.. ఖరీఫ్‌లో 167.75 లక్షల ఎకరాలతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్ (105.66), మధ్యప్రదేశ్ (104.03), ఛత్తీస్‌గఢ్ (91.37) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, రబీ విషయానికి వస్తే ఈ పెద్ద రాష్ట్రాలన్నీ 'అతిస్వల్ప' సాగుతో వెనుకబడిపోయాయి. కానీ తెలంగాణ మాత్రం ఖరీఫ్‌లో 69.90 లక్షల ఎకరాలు, యాసంగిలో 59.90 లక్షల ఎకరాలతో కలిపి.. రెండు సీజన్లలో కలిపి మొత్తం 129.80 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో వరి సాగు చేపట్టింది. రెండు సీజన్లను కలిపి చూస్తే దేశంలోనే అత్యధిక సాగు విస్తీర్ణంలో ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచి తన సత్తా చాటింది.

ఏపీని చుట్టేసిన రుతుపవనాలు.. తెలంగాణలోకి..
ఏపీని చుట్టేసిన రుతుపవనాలు.. తెలంగాణలోకి..

ధాన్యం కొనుగోళ్లలోనూ సరికొత్త చరిత్ర

కేవలం సాగులోనే కాదు, పండించిన పంటను కొనుగోలు చేయడంలోనూ తెలంగాణ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ప్రస్తుత రబీ సీజన్‌లో శనివారం నాటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు 72.30 లక్షల టన్నులకు చేరాయి. మరో వారం రోజుల పాటు ఈ కొనుగోళ్లు సాగనుండటంతో ఈ మార్కు సులభంగా 75 లక్షల టన్నులు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దసరా, సంక్రాంతి సెలవులు లిస్ట్ వచ్చేసింది. అకడమిక్ క్యాలెండర్ ఇదే
దసరా, సంక్రాంతి సెలవులు లిస్ట్ వచ్చేసింది. అకడమిక్ క్యాలెండర్ ఇదే

కాగా, పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు కలిపినా ధాన్యం కొనుగోళ్లు 40 లక్షల టన్నుల లోపే పరిమితమవ్వడం గమనార్హం. రెండు సీజన్లు కలిపి రాష్ట్రంలో సుమారు 282 లక్షల టన్నుల భారీ దిగుబడి వచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, రైతుల శ్రమ తోడై తెలంగాణను దేశంలోనే తిరుగులేని ధాన్య భాండాగారంగా నిలబెట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+