యాదాద్రీశుని ఆలయ హుండీకి భారీ ఆదాయం..
తెలంగాణలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలలో యాదాద్రి ఒకటి. ఈ ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా కూడా పిలుచుకుంటారు. ఇక్కడ నిత్యం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం అనంతరం ఇక్కడికి భక్తులు బారులు తీరుతున్నారు. వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో నగరవాసులంతా యాదాద్రి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. వీకెండ్ ఓ పక్క, వినాయక చవితి పండుగ ఇలా సెలవులు రావడంతో యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ హుండీకి భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
నిన్న (శనివారం) వినాయక చవితి, వీకెండ్ కావటంతో వేల సంఖ్యలో భక్తులు లక్ష్మినరసింహస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మెుక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో భక్తులు లక్ష్మి నరసింహస్వామివారి దర్శనం చేసుకోవడంతో యాదాద్రి ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. శనివారం ఒక్క రోజే 11,64,144 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు పేర్కొన్నారు. పూర్తి వివరాల మేరకు.. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 57,424 వేలు సమకూరగా, దర్శనాల ద్వారా రూ. 33,900 వచ్చాయి.

బ్రేక్ దర్శనాల ద్వారా రూ. 44,100 రాగా, ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,47,960 లభించింది. కల్యాణకట్ట ద్వారా రూ.42,000 రాగా, యాదరుషి నిలయం ద్వారా రూ.33,728 సమకూరింది. సువర్ణ పుష్పార్చాన ద్వారా రూ.26,400 వచ్చినట్లు తెలిపారు. కార్ పార్కింగ్ ద్వారా రూ.1,50,000 ఇలా మెుత్తంగా రూ.11,64,144 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. నేడు (ఆదివారం) సెలవు దినం కావటంతో భక్తుల రద్దీ మరింత పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే ఆలయ హుండీ ఆదాయం కూడా పెరిగే అవకాశముందని ఆలయ అధికారులు తెలిపారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications