హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హుజీ అనుమానిత ఉగ్రవాది అరెస్ట్‌: చెరువులో ఈతకెళ్లి నలుగురు హైదరాబాదీల మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హుజీ అనుమానిత ఉగ్రవాది అలీముల్ ఇస్లాంను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. చర్లపల్లి జైలులో పాకిస్థాన్ హుజీ ఉగ్రవాది నజీర్‌ను కలిసేందుకు అలీముల్ యత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

నజీర్‌తో కలిసి జిహాదీ కేంద్రం ఏర్పాటుకు అలీముల్ కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. అలీముల్ అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇస్లాంను పశ్చిమ బెంగాల్ వాసిగా పోలీసులు గుర్తించారు.

huji suspected terrorist arrested in hyderabad

హైదరాబాద్‌లో నైజీరియన్ అరెస్ట్

విదేశీ కరెన్సీ పేరుతో ఆరేళ్లుగా మోసం చేస్తున్న నైజీరియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి రూ. 75 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నైజీరియన్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

చెరువులో ఈతకెళ్లి నలుగురు హైదరాబాదీల మృతి

వరంగల్ జిల్లా మద్దూరు మండలం గాగిళ్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పెద్ద చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు.

మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులు నలుగురు కూడా హైదరాబాద్‌కు చెందిన వారే. అయితే దసరా పండుగ కోసం తమ బంధువుల ఊరైన గాగిళ్లాపూర్‌కు ఆ నలుగురు వెళ్లారు. మృతులను బాల పోచయ్య(42), నర్సింహులు(40), మధు(14), ప్రవీణ్(17)లుగా గుర్తించారు.

English summary
A Huji suspected terrorist arrested in hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X