జయశంకర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం: ఏడాదిపాటు 13 మంది సస్పెండ్
హైదరాబాద్: విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నివారణకు అనేక చట్టాలు వచ్చినా.. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఆ భూతం మాత్రం ఏదో ఒక చోట విద్యార్థులను వేధిస్తూనే ఉంది. ర్యాగింగ్ భూతానికి కొందరు బలవుతుండగా, మరికొందరు విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు.
తాజాగా, రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. హాస్టల్లో జూనియర్లను తమ గదికి పిలిపించి సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడ్డారు. ర్యాగింగ్ స్క్వాడ్ కు జూనియర్లు ఫిర్యాదు చేయడంతో.. అధికారులు చర్యలు తీసుకున్నారు.

ర్యాగింగ్కు పాల్పడిన 20 మంది సీనియర్ విద్యార్థులపై వేటు వేశారు. 13 మంది విద్యార్థులను హాస్టల్ నుంచి ఏడాదిపాటు, మరో ఏడుగురిని ఒక సెమిస్టర్ పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు, విద్యా సంస్థల్లో ర్యాగింగ్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ర్యాగింగ్ కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
తెలంగాణా విద్యార్థులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్న భోజనంలో చేపలు! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications