టీఆర్ఎస్కు షాక్: కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్తిక
హైదరాబాద్: నగర శివారులోని ఆదిభట్ల మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కొత్త ఆర్తిక గౌడ్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆర్తిక.. చైర్ పర్సన్ ఎన్నిక ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె తిరిగి చైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు.
ఘాటైన అందాలతో హీరోయిన్ వేదిక.. మీరు ఎప్పుడూ చూడని హాట్ ఫోటోలు
కాగా, ఇటీవల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో ఆమెకు విభేదాలు ఏర్పడ్డాయి. మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ భర్త ప్రమేయం విమర్శలకు తావిచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్లోని 15 మంది కౌన్సిలర్లలో 14 మంది ఆర్తికపై జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు నేపథ్యంలో డీపీవో శ్రీనివాస్ రెడ్డి సోమవారం విచారణ జరిపారు. ఈ క్రమంలో ఆర్తిక కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఐదుగురు కౌన్సిలర్లతో వెళ్లి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు.
యువ హీరోయిన్ సంజనా లేటేస్ట్ ఫోటో షూట్.. వైరల్ పిక్స్
తాను టీఆర్ఎస్లో ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు ఆర్తిక. ఆ తర్వాత కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్టికపై కౌన్సిలర్లు ఇచ్చిన ఫిర్యాదుపై డీపీవో విచారణ జరుపుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఆర్తిక గౌడ్ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలో చేరడంతో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్లయింది.