బిర్యానీ ఉడకలేదనడంతో గొడవ: కస్టమర్లపై దాడి చేసిన వెయిటర్లు, రాజా సింగ్ వార్నింగ్ (వీడియో)
హైదరాబాద్: నగరంలోని అబిడ్స్లో ఓ హోటల్లో బిర్యానీ విషయమై తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నూతన సంవత్సర సందర్భంగా ధూల్పేటకు చెందిన కొందరు యువతీయువకులు రాత్రి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే బిర్యానీ సరిగా ఉండకలేదని, తాము పూర్తి డబ్బులు చెల్లించలేమని హోటల్ సిబ్బందికి చెప్పారు. అయితే దీనికి వారు అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది.
కస్టమర్లు వెయిటర్పై దాడి చేయడంతో.. ఆ తర్వాత వెయిటర్లు, హోటల్ సిబ్బంది.. వినియోగదారులపై కర్రలు, కుర్చీలతో దాడికి దిగారు. ఈ క్రమంలో కొంతమంది వినియోగదారులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి, నలుగురు వెయిటర్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ధూల్పేట మహిళలు, వ్యక్తులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
On the night of December 31st , there was a fight in the Abids Grand Hotel,The hotel staff beat the customers with sticks.#Hyderabad pic.twitter.com/ofqzpITH2l
— Arbaaz The Great (@ArbaazTheGreat1) January 1, 2024
గ్రాండ్ హోటల్ హోటల్ యజమాని, సిబ్బందిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్పై దాడి చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. మరోవైపు, యజమానిని అరెస్టు చేయాలంటూ అబిడ్స్ పీఎస్ ముందు ధూల్పేట లోద్ సమాజ్ నాయకులు ఆందోళన చేపట్టారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications