వైఫై స్విచ్చాఫ్ చేసిందని భార్యపై దాడి, ఆసుపత్రిలో చికిత్స
హైదరాబాద్: నిత్యం ఇంటర్నెట్లో గడుపుతున్న కారణంగా వైఫై సేవలను నిలిపివేసిన భార్యపై చితకబాదాడు ఓ భర్త. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ ఘటన హైద్రాబాద్లో చోటు చేసుకొంది.
హైద్రాబాద్ సోమాజిగూడలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు సుల్తానా అనే మహిళ తన భర్త అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్లో మునిగిపోతుండటం భరించలేకపోయింది. ఈ క్రమంలో వైఫైను ఆఫ్ చేయటంతో ఆ భర్తకు చిర్రెత్తుకొచ్చింది.
వైఫై బటన్ ఆఫ్ చేయడంతో కోపంతో భార్యపై దాడికి దిగాడు. కోపంలో ఆమెపై విచక్షణరహితంగా కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో సుల్తానాను గురువారం ఉదయం ఆస్పత్రిలో చేరింది.
సుల్తానా ముఖం, ఛాతీ, తలపై గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సుల్తానా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసే ముందు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చే యత్నం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.