వరంగల్ ఎన్ఐటీలో హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో విషాద ఘటన చోటు చేసుకుంది. నెట్ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరానికి చెందిన విద్యార్థి హృతిక్ సాయి వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు.
మార్కులు తక్కువగా వస్తున్నాయనే మనస్తాపంతో వడ్డేపల్ల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాలేజీ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బీటెక్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆములూరులో చిన్నరాములు అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పొలంలో గొర్రెలు కాస్తుండగా పిడుగుపడి రాములు మృతి చెందాడు. ఇది ఇలావుండగా, బీహార్ రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో పిడుగుపాటుకు 25 మంది మృతి చెందడం గమనార్హం. ఒక్క నలంద జిల్లాలోనే 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. బుధవారం కూడా పిడుగుపడి పది మందికిపైగా మృతి చెందారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications