నేను బతికే ఉన్నాను ... ఆస్థి కోసం నా కొడుకు నన్ను చంపేశాడని ఓ తల్లి న్యాయపోరాటం
అయ్యా నేను బ్రతికే ఉన్నాను.. ఆస్తి కోసం నా కొడుకు నేను చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించాడు. నా ఆస్తినంతా కబ్జా చేశాడు.. నాకు న్యాయం చేయండి అంటూ ఓ తల్లి దీనంగా వేడుకుంది. ఇక తన సమస్య గురించి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య కు వినతిపత్రం అందజేసి మరి తనకు న్యాయం చేయమని వేడుకుంటుంది.

తనకున్న భూమిని కౌలుకిచ్చి జీవనం సాగిస్తున్న భద్రమ్మ
ఇక అసలు విషయానికొస్తే బయ్యారం మండల కేంద్రానికి చెందిన కొండ్రెడ్డి భద్రమ్మ కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ వివాహం చేసి ఆస్తి సమానంగా పంచిన ఆమె భర్త చంద్రయ్య కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఇక ముగ్గురు కుమారులలో ఇద్దరు కుమారులు కూడా మరణించారు. ప్రస్తుతం ఆమెకు పెద్ద కుమారుడు మాత్రమే ఉన్నాడు. అయితే భద్రమ్మ ఆమె పేరు మీద ఉన్న 2.06 ఎకరాల భూమిని కౌలుకిచ్చి దాని ద్వారా వచ్చే డబ్బులతో జీవనం గడుపుతూ ఉంది. రైతుబంధు డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చి తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన భద్రమ్మ కొడుకు చేసిన ఘనకార్యం తెలిసి కన్నీరుమున్నీరవుతోంది.

తల్లి చనిపోయినట్టు మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆస్థి తనపరుకు మార్చుకున్న కొడుకు
భద్రమ్మ పేరుమీద ఉన్న భూమిని ఆమె చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కొడుకు సోమిరెడ్డి తన పేరు మీద పట్టా చేయించుకున్నాడని భద్రమ్మ లబోదిబోమంటున్నారు. తనకు రైతు బంధు రాకపోవటంతో అధికారుఅలను అడిగిన ఆమెకు ఈ విషయం చెప్పారు సదరు అధికారులు. తాను బతికే ఉన్నానని, అధికారులు ఎలాంటి విచారణ చేయకుండా నేను చనిపోయానని నిర్ధారించి, నా కుమారుడి పేరు మీద భూమిని పట్టా చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె వాపోతోంది. ఇక దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి తన భూమి తనకు ఇప్పించాలని, దాని మీదనే ఆధారపడి బ్రతుకుతున్నానని భద్రమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది.

న్యాయం కోసం తల్లి పోరాటం .. చర్య తీసుకోవాలని, న్యాయం చెయ్యాలని వినతి
సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని, ఇప్పటికైనా అధికారులు తనకు జరిగిన అన్యాయంపై స్పందించాలని, న్యాయం అందించాలని భద్రమ్మ కోరుతోంది.
కన్నకొడుకే బ్రతికున్న తల్లిని ఆస్తి కోసం చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆమె జీవనాధారమైన భూమిని కూడా లేకుండా చేయడంతో ఆ తల్లి నిజంగానే జీవశ్చవం గా మారిపోయింది. కొడుకు చేసిన పనికి కుమిలి కుమిలి ఏడుస్తుంది. నేను బ్రతికి ఉన్నాను అంటూ అందరికీ అర్థమయ్యేలా చెప్తుంది. అధికారులు స్పందించాలని కోరుకుంటోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications