అర్థరాత్రి బాబాయితో అక్రమ సంబంధం.. అడ్డువచ్చిన భర్తను ప్రియుడితో కలిసి హత్య..
వావివరసలు మరిచి బాబాయి వరసయ్యే వ్యక్తితోనే ఆమె లైంగిక సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో ఉండగానే.. అర్థరాత్రి ప్రియుడితో కలిసి సరస కలాపాలు సాగించింది. వారి లైంగిక సంబంధం చూసి ఖంగుతిన్న భర్త .. గొడవకు దిగాడు. దీంతో భర్త అడ్డుతొలగించేందుకు ప్రియుడితో కలిసి భార్య హతమార్చింది. అసలు విషయాన్ని పక్కన పెట్టి కొత్త డ్రామాకు తెరలేపింది. భర్త వేధింపులు తాళలేక హత్య చేసినట్లు సీన్ క్రియేట్ చేసింది. ఆమె ప్రవర్తనలో అనుమానం రావడంతో పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేశారు . దీంతో అసలు బండారం బయటపడింది.

బాబాయితో లైంగిక సంబంధం..
ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన మాడుగుల కృష్ణతో ఇనపనూరి జయరాజు భార్య నిరోష అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడిని ఏకంగా ఇంటికే రప్పించుకుంది. ఫిబ్రవరి 26న రాత్రి జయరాజు మద్యం తాగి ఇంట్లో నిద్రించాక కృష్ణ వచ్చారు. అర్థరాత్రి సృహలోకి వచ్చిన జయరాజు తన భార్య నిరోషతో కృష్ణ కలిసి ఉండడం చూశారు. కృష్ణను తన ఇంటివద్ద ఎందుకు ఉన్నావని ప్రశ్నించారు . ఇద్దరూ గొడవపడ్డారు.

రోకలిబండతో కొట్టి హత్య..
గొడవ పెద్దయ్యైంది. దీంతో జయరాజును కృష్ణ కొట్టి తన్నడంతో కిందపడిపోయాడు. విషయం బయటకు తెలిస్తే ఇబ్బంది అవుతందని భార్య భావించింది. దీంతో పక్కనే ఉన్న రోకలిబండతో జయరాజు తలపై బలంగా నిరోష కొట్టింది. దీంతో జయరాజు ఆపస్మారక స్థితిలో పడిపోయాడు. స్ప్పహ తప్పిన జయరాజును ఇద్దరూ కలిసి దుప్పటితో తలపై గట్టిగా కప్పారు. ఊపిరి ఆడకుండా చేయడంతో మృతి చెండాడు.

పోలీసుల విచారణలో అసలు బండారం..
జయరాజు మృతిపై పోలీసులు విచారణ చేపట్టగా తొలుత పెద్ద డ్రామానే క్రియేట్ చేసింది నిరోష, తరచూ తాగివచ్చి వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయింది. ఆమె కదలికలు, ప్రవర్తన రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో అసలు బండారం భయటపడింది. తమ అక్రమ సంబంధాన్ని అడ్దువస్తున్నాడని హత్య చేసినట్లు ఇద్దరూ పోలీసుల విచారణలో తమ నేరాన్ని ఒప్పుకున్నారు. వారిపై హత్య కింద కేసు నమోదు చేసినట్లు వైరా సీఐ జే. వసంత్ కుమార్ తెలిపారు. ఇద్దరు నిందితులనున మదిర కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితులకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications