హైద్రాబాద్ వాసి కరుణ్ శ్రీరామ హుస్టన్ పీడబ్ల్యూఈ సారధిగా ఎంపిక
టెక్సాస్ రాష్ట్రంలోని హుస్టన్ నగర ప్రజా పనులు, ఇంజనీరింగ్ సారధిగా ఇండో అమెరికన్ ఇంజనీర్ కరుణ్ శ్రీరామ ఎంపికయ్యారు. ప్రజా పనులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకుగాను వందరోజుల ప్లాన్ ను ఆయన ప్రకటించారు.
వాషింగ్టన్: టెక్సాస్ రాష్టంలోని హుస్టన్ నగర ప్రజా పనులు, ఇంజనీరింగ్ సారధిగా ఇండో అమెరికన్ ఇంజనీర్ కరుణ్ శ్రీరామ ఎంపికయ్యారు. ప్రజా పనులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకుగాను వందరోజుల ప్లాన్ ను ఆయన ప్రకటించారు.
నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఆయన పేరును ప్రతిపాదించారు. హైద్రాబాద్ కు చెందిన శ్రీరామ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ యూనివర్శిటీ ఆప్ రూర్కీలో మాస్టర్స్ పూర్తి చేశారు.

అమెరికాకు చేరుకొన్నాక యూనివర్శిటీ ఆఫ్ మిస్సోరీ రొల్లాలో సివిల్ ఇంజనీరింగ్ లో పిహెచ్ డి చేశారు. యూనివర్శిటీ ఆప్ టెక్సాస్ ముంచి ఎంబిఏ పట్టా పొందారు.
మేయర్ నిర్ణయానికి కౌన్సిల్ ఆమోదం తెలిపితే ఏప్రిల్ 3న, శ్రీరామ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. ప్రజా పనుల శాఖను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్ళనున్నట్టు చెప్పారాయన. ఈ మేరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.












Click it and Unblock the Notifications