టెన్త్ ఫలితాలపై ఇంటర్ ప్రభావం..! బిక్కు బిక్కు మంటున్న విద్యార్థులు..!!
హైదరాబాద్ : మొన్నటి వరకూ భవిష్యత్ అర్థం కాక ఆదోళన వ్యక్తం చేసిన ఇంటర్ విద్యార్తులు కాస్త తేరుకున్నారనుకునే లోపు మరో విద్యార్థి లోకం అయోమయంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ ఫలితాలతో ఉలిక్కి పడ్డ విద్యార్థి లోకం ఇప్పడు పదవ తరగతి ఫలితాలపై ద్రుష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాలు తెలంగాణ సర్కారుపై తీవ్ర ప్రభావం చూపింది. ఊహించని విధంగా ఎదురైన పెనువిపత్తు నుంచి తేరుకునేందుకు చాలాకాలమే పట్టేలా ఉంది. ఇదే.. ఎన్నికల ముందు జరిగినట్టయితే ఊహించని పరాభవం చవిచూడాల్సి వచ్చేదని గులాబీ నేతలు ఆవేదన వ్యక్తం చుేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. సున్నితమైన అంశం.. పైగా పిల్లలతో కూడిన విషయం కావటంతో విపక్షాలు కూడా దీన్ని రాజకీయం చేసుకునేందుకు నానాతంటాలు పడుతున్నాయి. బీజేపీ మరో అడుగు ముందుకేసి దీక్షల వరకూ చేర్చింది. దీంతో ఇదంతా రాబోయే పదోతరగతి పరీక్షా ఫలితాలపై పడుతుందనే భయం వెంటాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అందుకే మే 13వ తేదీన పదవ తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమైన అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమైంది. పిల్లలను మానసికంగా సిద్ధం చేసేందుకు కౌన్సెలింగ్ సెషన్లు కూడా మొదలుపెట్టారు. విద్యార్థులను స్కూల్స్కు పిలిపించి మరీ క్లాసులు తీసుకుంటున్నారట గురువులు. పరీక్షల్లో తప్పినా మరోసారి పరీక్ష రాసి పాస్ కావచ్చని ఊరడిస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా ఉండటంతోపాటు, ధైర్యం ఇవ్వటం ద్వారా సమస్యను అధిగమించవచ్చని వివరిస్తున్నారట. మరి ఊహించని విధంగా ఎదురైన అవరోధాన్ని అధిగమించటం పెద్ద ఇబ్బందిగా మారిందంటున్నా అధికారులు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అంటే ఇదేనంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి దీన్నుంచి సర్కారు ఎలా సురక్షితంగా బయటపడుతుందనేది ఆసక్తిగా మారింది.