Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ TO ఊటీ.. తక్కువ ధరకే IRCTC సమ్మర్ ప్యాకేజీ

వేసవి వచ్చేసింది. మార్చి మొదటి వారం నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఇక ఏప్రిల్, మే నెలలో ఎండలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. అయితే సమ్మర్ ఎటైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC) సంస్థ. అతి తక్కువ ధరకే ఈ సూపర్ ప్యాకేజీని అందిస్తోంది. దీంతో ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఊటీ అందాలను అది కూడా సమ్మర్ లో తక్కువ ధరలో ఆస్వాధించే అవకాశం ఉంది. మరి ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

దేశంలో చాలా హిల్ స్టేషన్లు ఉన్నాయి. అన్నీ కూడా కొండలు, లోయల మధ్య ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లోనే ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలకు హిల్ స్టేషన్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ఊటీ. వేసవిలో ఈ ప్రాంతానికి ఎక్కువగా వెళ్తుంటారు. ఎండ వేడిమిని తట్టుకోలేక ఈ ప్రాంతాలకు వెళ్తుంటారు టూరిస్టులు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో వేసవిలోనే కాదు శీతాకాలంలో కూడా పర్యాటకులు ఊటీకి క్యూ కడుతున్నారు. అయితే ఊటీకి వెళ్లే టూరిస్టుల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇక ఈ టూర్ పేరు 'అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్' గా ఉంది. ఊటీకి వెళ్లే టూరిస్టుల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ టూర్​ మార్చి 17, 24, 31, ఏప్రిల్ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంది. మీకు కావాలనుకున్న తేదీల్లో ఈ టూర్ ను బుక్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ ప్యాకేజీలో భాగంగా పర్యటకులు ఊటీ, కున్నూర్, బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్, దోడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా జలపాతం ప్రాంతాలను సందర్శించే వీలుంది.

టూర్ లో భాగంగా మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ఉంటుంది. రాత్రంతా ప్రయాణించాలి. అలా రెండో రోజు ఉదయం కోయంబత్తూరు రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడి నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్ లో బస చేసిన తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ సందర్శన ఉంటుంది. తర్వాతి రోజు దోడబెట్ట పీక్‌, టీ మ్యూజియం, పైకారా జలపాతం చూస్తారు.

నాలుగోరోజు కూనూర్ సంద‌ర్శ‌న‌కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే బస చేయాలి. ఇక ఐదో రోజు కోయంబత్తూర్‌ రైల్వేస్టేషన్​ కు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 3 గంటల 40 నిమిషాలకు శబరి ఎక్స్‌ప్రెస్​ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ చేయాలి. అలా ఆరో రోజు మధ్యాహ్నానికి సికింద్రాబాద్‌ చేరుకుంటారు. దాంతో టూర్ ముగుస్తుంది.

IRCTC Affordable Summer Getaway offers Hyderabad to Ooty Package at Low Cost Full Info Inside

ఇక టికెట్ ధరల విషయానికి వస్తే స్టాండర్డ్ ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలంటే రూ.30,060 పే చేయాలి. అలాగే ట్విన్ షేరింగ్‌ అయితే రూ.17,130, ట్రిపుల్ షేరింగ్‌ కు రూ.16,120 ఉంటుంది. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టికెట్ ధర రూ.8,840 గా ఉంది. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+