పెద్ద ఐటీ కంపెనీలు కుమ్మక్కై శాలరీలు తగ్గిస్తున్నాయి: పాయ్ సంచలనం
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు అన్ని ఏకమై కొత్తగా ఉద్యోగాలలో చేరే వారికి వేతనాలు తగ్గించి ఇస్తున్నాయని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, ఐటీ రంగ ప్రముఖులు టీవీ మోహన్ దాస్ పాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు అన్ని ఏకమై కొత్తగా ఉద్యోగాలలో చేరే వారికి వేతనాలు తగ్గించి ఇస్తున్నాయని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, ఐటీ రంగ ప్రముఖులు టీవీ మోహన్ దాస్ పాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన పీటీఐతో మాట్లాడారు. 'ఇండియన్ ఐటీ పరిశ్రమతో అదే సమస్య. కొత్తగా వచ్చే వారికి ఐటీ రంగం మెరుగైన వేతనాలు ఇవ్వడం లేదు. నిజం చెప్పాలంటే పెద్ద కంపెనీలన్నీ ఒక్కటై ఒకదానితో మరొకటి చర్చించుకొని వారి జీతాలను పెంచకుండా చేస్తున్నార'ని వ్యాఖ్యానించారు.
ప్రాథమిక స్థాయిలో సాఫ్టువేర్ ఇంజినీర్లు అధికంగా వస్తుండటంతో దానిని అవకాశంగా తీసుకుని ప్రారంభ వేతనాల్లో కోత విధిస్తున్నారన్నారు.

తాజా గణాంకాల ప్రకారం రెండు దశాబ్దాల కిందట సాఫ్టువేర్ ఉద్యోగుల ప్రారంభ వేతనం రూ.2.25లక్షలు (వార్షికంగా) ఉండగా, ఇప్పుడది కేవలం రూ.3.5లక్షలకు మాత్రమే పెరిగింది. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను పోల్చి చూస్తే ఇది చాలా తక్కువ మొత్తం.
ఐటీ పరిశ్రమకు ఇది మంచి పరిణామం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలను ముఖ్యంగా పెద్ద ఐటీ కంపెనీలు విడనాడాలన్నారు. కంపెనీల్లో ఉన్న పెద్దవాళ్ల వేతనాలల్లో కోత పెట్టడం ద్వారా కొత్తగా వచ్చే వారికి మెరుగైన జీతాలు ఇవ్వాలన్నారు.
జీతాలు పెంచని పక్షంలో తెలివైనవారు ఉద్యోగాలు చేసేందుకు ఇష్టపడరని, తద్వారా మంచి ఉద్యోగులను కోల్పోతామన్నారు. మోహన్ దాస్ పాయ్ 1994-2006 మధ్య బెంగళూరు ఇన్ఫోసిస్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పని చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications