వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీగ్రిడ్ కేసులో ఏపీ సీఈసీ హైకోర్టు నోటీసులు : రిజిస్ట్రార్, ఆధార్ కంపెనీకి కూడా ..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఐటీగ్రిడ్ కేసులో ఏపీ ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ రిజిస్ట్రార్, ఆధార్ కంపెనీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపిన ఈ కేసు విచారణ .. బుధవారం హైకోర్టులో జరిగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఐటీగ్రిడ్ సీఈవో అశోక్ ఇదివరకే హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసుల పరిధి దాటి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.

రాజకీయం కాదు .. కదా ?
అయితే ఫిర్యాదు చేసిన సదరు వ్యక్తి మాత్రం ఈ పరిణామం రాజకీయంగా జరిగింది కాదని పేర్కొన్నారు. ఎన్నికలు, ఆధార్ డేటా చోరీకి గురైందని తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాలయంలో హైదరాబాద్ లో ఉన్నందున తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

itgrid case : telangana high court notice to ap cec, central cec

అలా ఎలా ?
ఎన్నికల కమిషన్ సంబంధించిన డాటా పోయిందా, లేదా ఆధార్ కు సంబంధించిన డాటా దుర్వినియోగం అయిందా అనేది ఆ సంస్థలు చెబితే తెలుస్తుంది తప్ప వేరే వారు ఎలా చెబుతారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా అశోక్ తరఫున వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు ఏపీ సీఈసీ తదితర సంస్థలకు నోటీసులు జారీచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

English summary
Telangana High Court issued notices to the AP Election Commission, Central Election Commission, AP Registrar and Aadhar Company in IT Gride case. The case was filed by the high court on Wednesday. IT Gride CEO Ashok has already resorted to the high court to remove the case registered against him. Alleging that the Telangana police had issued notices beyond the scope of the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X