ఐటీగ్రిడ్ కేసులో ఏపీ సీఈసీ హైకోర్టు నోటీసులు : రిజిస్ట్రార్, ఆధార్ కంపెనీకి కూడా ..
హైదరాబాద్ : ఐటీగ్రిడ్ కేసులో ఏపీ ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ రిజిస్ట్రార్, ఆధార్ కంపెనీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపిన ఈ కేసు విచారణ .. బుధవారం హైకోర్టులో జరిగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఐటీగ్రిడ్ సీఈవో అశోక్ ఇదివరకే హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసుల పరిధి దాటి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.
రాజకీయం
కాదు
..
కదా
?
అయితే
ఫిర్యాదు
చేసిన
సదరు
వ్యక్తి
మాత్రం
ఈ
పరిణామం
రాజకీయంగా
జరిగింది
కాదని
పేర్కొన్నారు.
ఎన్నికలు,
ఆధార్
డేటా
చోరీకి
గురైందని
తెలిపారు.
దీనికి
సంబంధించిన
కార్యాలయంలో
హైదరాబాద్
లో
ఉన్నందున
తెలంగాణ
పోలీసులకు
ఫిర్యాదు
చేసినట్టు
తెలిపారు.
అలా
ఎలా
?
ఎన్నికల
కమిషన్
సంబంధించిన
డాటా
పోయిందా,
లేదా
ఆధార్
కు
సంబంధించిన
డాటా
దుర్వినియోగం
అయిందా
అనేది
ఆ
సంస్థలు
చెబితే
తెలుస్తుంది
తప్ప
వేరే
వారు
ఎలా
చెబుతారని
సుప్రీంకోర్టు
సీనియర్
న్యాయవాది
సిద్ధార్థ్
లోత్రా
అశోక్
తరఫున
వాదనలు
వినిపించారు.
దీంతో
హైకోర్టు
ఏపీ
సీఈసీ
తదితర
సంస్థలకు
నోటీసులు
జారీచేసింది.
దీనిపై
వివరణ
ఇవ్వాలని
కోరింది.
ఈ
కేసు
తదుపరి
విచారణను
ఈ
నెల
22కి
వాయిదా
వేసింది.