భద్రత అలర్ట్: ఇవాంక చార్మినార్ విజిట్ రద్దు, గాజుల వ్యాపారులకు నిరాశే
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్ చార్మినార్ సందర్శన కార్యక్రమం రద్దయింది. భద్రతా కారణాల రీత్యా దీన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్ చార్మినార్ సందర్శన కార్యక్రమం రద్దయింది. భద్రతా కారణాల రీత్యా దీన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కోసం ఎదురు చూస్తున్న పాతబస్తీ గాజుల వ్యాపారులకు నిరాశే మిగిలింది.
ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చిన ఇవాంకా ట్రంప్ ప్రస్తుతం ట్రైడెంట్ హోటల్లో బస చేస్తున్నారు. తొలిసరి హైదరాబాద్కు వచ్చిన ఆమెకు నగర అందాలను చూపించాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుని ఏర్పాట్లు కూడా చేసింది.
హైదరాబాద్కు ఐకాన్ అయినటువంటి చార్మినార్, గోల్కొండ ప్రాంతాల్లో పర్యటింపజేయడంతోపాటు.. ఆమెతో పాతబస్తీ గాజుల మార్కెట్లో షాపింగ్ చేయించాలని భావించింది. అయితే సెక్యూరిటీ కారణాల వల్ల చార్మినార్ను చూసేందుకు ఇవాంకా రావడం లేదని అమెరికా భద్రతా విభాగం తెలియజేసింది.
బుధవారం ఉదయం జీఈఎస్ సదస్సులో పాల్గొని మధ్యాహ్నం గోల్కొండ కోటను చూసేందుకు వెళ్తారని వెల్లడించింది.