వీసీపై చర్యలు తీసుకోవాలి: జైపాల్ రెడ్డి, తెరాసపైనా విసుర్లు
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దళితులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ విశ్వవిద్యాలయం ఘటనపై లేదని ఆయన విమర్శించారు.
విద్యార్థి వేముల రోహిత్ మరణం తీరని లోటు అని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్షా శిబిరాన్ని ఆయన తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యుడు టి. జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డిలతో కలిసి సందర్శించారు.
విశ్వవిద్యాలయం విద్యార్తులను సంఘ విద్రోహులుగా చిత్రీకరిస్తున్న తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థులకు రక్షణ కల్పించాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. రోహిత్ మరణంపై కేంద్రం వ్యవహరించిన తీరు బాధాకరమని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నేతలు కూడా విద్యార్తుల నిరవధిక దీక్షా శిబిరాన్ని శనివారంనాడు సందర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తును ఫణంగా పెట్టి ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు తాము అండగా ఉంటామని వారు చెప్పారు.
రోహిత్ ఘటనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వివరిస్తామని వారు చెప్పారు. కాంగ్రెసు పార్టీ తరఫున రోహిత్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా పోరాటం చేస్తామని అన్నారు.
విద్యార్థులను పరామర్శించినవారిలో ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, సి. రామచంద్రయ్య, శైలజానాథ్ తదితరులు ఉన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications