ప్రమాదకరం, మద్దతెలా: జైపాల్, మీరు మమ్మల్ని అడగలేదే: తెరాస
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో తమ పార్టీకి చీకటి ఒప్పందం లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ శుక్రవారం చెప్పారు.వారితో తమకు ఉన్నదంతా అభివృద్ధి ఒప్పందమేనని తెలిపారు.
హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో తమ పార్టీకి చీకటి ఒప్పందం లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ శుక్రవారం చెప్పారు. వారితో తమకు ఉన్నదంతా అభివృద్ధి ఒప్పందమేనని తెలిపారు.
తాము అటు ఎన్డీయేలోనూ, ఇటు యూపీఏలోనూ లేమని చెప్పారు. దేశంలో నిజమైన లౌకికవాది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే ముందు ఎన్డీఏ తెరాసను సంప్రదించిందని, కేసీఆర్ సూచన మేరకే దళిత అభ్యర్థిని అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. ఈ అంశంలో కాంగ్రెస్ తమను ఎందుకు సంప్రదించలేదని నిలదీశారు.
కాగా, అంతకుముందు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తెరాసపై నిప్పులు చెరిగారు. ఎన్డీయే అభ్యర్థికి కేసీఆర్ ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలన్నారు. ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ది ఆరెస్సెస్ నేపథ్యం అని తెలిపారు.
రామ్నాథ్ ఎంపిక ప్రమాదకరమన్నారు. గతంలో మైనార్టీలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. తెలంగాణ బిల్లులో మీరా కుమార్ కీలకంగా వ్యవహరించారని చెప్పారు. అలాంటి మీరాకుమార్కు తెరాస మద్దతివ్వాలని చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications