జై సమైక్యాంధ్ర నినాదం చేయలేదు: ఎంపీ కవిత(పిక్చర్స్)
హైదరాబాద్/న్యూయార్క్: జై తెలంగాణ, జై ఆంధ్ర అనేది తమ నినాదమని అమెరికా పర్యటనలో ఉన్న నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అంతేగాక, జై సమైక్యాంధ్ర నినాదం మాత్రం కాదని ఆమె స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న కవిత.. అక్కడ జరిగిన అమెరికా తెలంగాణ సంఘం(ఆటా) ప్రపంచ ప్రథమ మహాసభల వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జై ఆంధ్ర, జై తెలంగాణ అంటే కొందరు తప్పు పడుతున్నారని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఇదేం తాము కొత్తగా అనడం లేదని తెలంగాణ ఉద్యమ కాలంలోనే తెలంగాణ, ఆంధ్ర రెండూ అభివృద్ధి చెందుతాయని, రెండు రాష్ట్రాలు అయితే రెండు ప్రాంతాల వారికీ ప్రయోజనం అన్నామని చెప్పారు.
జై ఆంధ్ర, జై తెలంగాణ తమ నినాదమన్న కవిత.. సమైక్యాంధ్ర మాత్రం కాదు అని స్పష్టం చేశారు. తమ నినాదాన్ని కొందరు జై ఆంధ్ర అన్నారంటూ వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటామని, అయితే తెలంగాణలో ఆంధ్ర పార్టీల పెత్తనాన్ని అంగీకరించేది లేదని అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఇది ఇలా ఉండగా, అమెరికాలో యాదగిరి లక్ష్మీనరసింహుడిని ప్రతిష్ఠించడం శుభసూచకమని కవిత అన్నారు. ఆ దేవుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని, మరోవైపు ఉపాధి అవకాశాలు పెంచుతున్నట్టు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించే విధంగా విధానాలకు రూపకల్పన చేస్తున్నట్టు కవిత వివరించారు.
ఇటీవల తాను పార్లమెంటరీ కమిటీ తరపున అమెరికాలో పర్యటించినప్పుడు టిఎస్ ఐపాస్ గురించి వివరించానని, రైట్ టూ పర్మిషన్ అనేది బిజినెస్మెన్కు ఇస్తుండటం పట్ల అమెరికా పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేసినట్లు చెప్పారు. అమెరికాలో కూడా అలాంటి విధానాన్ని రూపొందించలేదని అమెరికన్లు మెచ్చుకున్నారని కవిత తెలిపారు.
తెలంగాణ పోరాటంలో ఏనాడూ హింసకు తావు ఇవ్వలేదని, గాంధీజీ సత్యాగ్రహ విధానాన్నే తామూ నమ్మామని చెప్పారు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించినట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ అభివృద్ధిని తెలియజేయాల్సి ఉందని అన్నారు. దీనికి ఆటా వేదిక కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ పేరుతో ఎన్ని సంఘాలు ఉన్నా మంచిదే అని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటను ఆమె ప్రస్తావించారు.
అమెరికాలోని అన్ని తెలంగాణ సంఘాలను కలుపుకొని ఆటా పని చేయాలని సూచించారు. అదే విధంగా ఆల్ ఇండియా సంఘాలతో కలిసి కార్యక్రమాలు రూపొందించుకోవాలని కోరారు. తెలంగాణ తరపున కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ కవిత తెలిపారు.
ఎంపీ కవింత
ప్రజాస్వామిక విలువలలో తెలంగాణ రాష్ట్రం భారత్లోనే నెంబర్ వన్ అని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు.
ఎంపీ కవిత
అమెరికాలో జరిగిన అమెరికా తెలంగాణ సంఘం (ఆటా) నిర్వహించిన ప్రపంచ తెలంగాణ ప్రథమ మహాసభల వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఎంపీ కవిత
యాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని అమెరికాలో ప్రతిష్టించుకుంటుండటం శుభసూచకమన్నారు. ఆ దేవుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఒక వైపు ఉపాధి కల్పన జరుగుతోందని, మరో వైపు పెట్టుబడులను ఆకర్షించేందుకు పాలసీలు రూపొందుతున్నాయని తెలిపారు.
ఎంపీ కవిత
ఇటీవల తాను పార్లమెంటరీ కమిటీ తరపున అమెరికాకు వచ్చినప్పుడు టిఎస్ఐపాస్ను ప్రెజెంట్ చేశానని, రైట్ టు పర్మిషన్ అనేది బిజెనెస్మెన్కు ఇస్తుండటం పట్ల అమెరికన్లు తమ హర్ష్యాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. తాము అమెరికాలో కూడా అలాంటి పాలసీని క్రియేట్ చేయలేద అని అమెరికన్స్ మెచ్చుకున్నారని కవిత వివరించారు.
ఎంపీ కవిత
‘తెలంగాణ పోరాటంలో ఏ నాడూ హింసకు తావివ్వలేదు. గాంధీ గారి సత్యాగ్రహం నమ్మాం. అదే విషయాన్ని ఇక్కడ మార్టిన్ లూథర్ కింగ్ చెప్పారు. వారి స్పూర్తితో తెలంగాణ పోరాటాన్ని కొనసాగించాం' అని కవిత తెలిపారు.
ఎంపీ కవిత
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కొందరు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. ఇటీవల చికాగోలో జరిగిన కన్వెన్సన్లో తాను జై తెలంగాణ, జై ఆంధ్రా...అనడాన్ని కొందరు తట్టుకోలేక పోతున్నారు.
ఎంపీ కవిత
జై తెలంగాణ, జై ఆంధ్రా.. అనేది పాత నినాదమేనన్నారు. ‘జై తెలంగాణ.. జై ఆంధ్రా.. బట్ నో జై సమైక్యాంధ్ర.. అది మన నినాదం' అని కవిత తెలిపారు.