మార్చి 16న, ఇండియన్ అమెరికన్ అప్రిషియేషన్ డే , టెక్కీ శ్రీనివాస్ కు నివాళి
మార్చి 16వ, తేదిని ఇండియన్ అమెరికన్ అప్రిషియేషన్ రోజుగా జరుపుకోవాలని క్యానాస్ గవర్నర్ నిర్ణయం తీసుకొన్నారు. ఇండియన్లకు సాదరంగా స్వాగతం పలుకుతామని ఆయన ప్రకటించారు.
హైద్రాబాద్: మార్చి 16వ, తేదిని ఇండియన్ అమెరికన్ అప్రిసియేషన్ రోజుగా జరుపుకోవాలని కాన్సాస్ గుర్తించింది. జాత్యంహకార దాడులు పునరావృతం కానివ్వబోమని క్యానాస్ గవర్నర్ బ్రౌన్ బ్యాక్ ప్రకటించారు. ఇండియన్లకు తాము సాదరంగా స్వాగతం పలుకుతామని ఆయన పునరుద్ఘాటించారు.
ఇటీవల అమెరికాలో జాత్యంహకార దాడిలో హైద్రాబాద్ కు చెందిన టెక్కీ కూచిబొట్ల శ్రీనివాస్ మరణించాడు. ఈ ఘటనపై అమెరికాలో సాగుతున్న దాడుల పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
అయితే అమెరికాలో నావిక దళంలో పనిచేసిన మాజీ సైనికోద్యోగి ఆడమ్ ప్యూరిటన్ ఓ బార్ లో ఈ ఏడాది ఫిబ్రవరి 22న, శ్రీనివాస్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ ఆసుపత్రిలో చనిపోయాడు.ఆలోక్ రెడ్డి ఈ ఘటనలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు. ప్యూరిటన్ దాడి నుండి తప్పించేందుకుగాను మరో అమెరికన్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే హింసను క్యానాస్ గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన హమీ ఇచ్చారు.అయితే క్యానాస్ మంచి ప్రదేశంగా మారడంలో ఇండియన్ల పాత్రను మరువలేనిదని ఆయన కొనియాడారు.ఇందుకుగాను ఆయన ఇండియన్లకు ధన్యవాదాలు తెలిపారు.
అయితే భారతీయులకు తాము ఘనంగా స్వాగతం పలుకుతామని ఆయన చెప్పారు. తమ విలువలను కొనసాగిస్తామని ఆయన టోపెకాలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు.
ప్యూరిటన్ దాడిలో గాయపడిన గ్రిల్లియాంట్ అనే అమెరికన్ మాదసానిలు కూడ ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ ఈ సభకు హజరైన జనం సాక్షిగా బ్రౌన్ బ్యాక్ మాదసానిని క్షమాపణలు కోరారు.
ప్యూరిటన్ దాడి నుండి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన అమెరికన్ ఇయాన్ గ్రిల్లియాంట్ ను బ్రౌన్ బ్యాక్ అభినందనలతో ముంచెత్తారు. అలోక్ రెడ్డి, గ్రల్లియాంట్ లు త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకొన్నారు. ప్రతి ఏటా మార్చి 16వ, తేదిన ఇండియన్, అమెరికన్ అప్రిషియేషన్ దినోత్సవంగా గుర్తిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
క్యానాస్ లో ఉండే ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తామని బ్రౌన్ బ్యాక్ మరోసారి హమీ ఇచ్చారు. ఈ సభలో పాల్గొన్న మాదసాని మాట్లాడుతూ కూచిబొట్ల శ్రీనివాస్ తమకు అందరికీ ఆదర్శప్రాయుడన్నారు.అంతేకాదు ఆయన అంటే తమకు గర్వకారణమన్నారు. శ్రీనివాస్ మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications