వ్యూహాత్మకం: కుమారస్వామికి కేసీఆర్ ప్రశంస, జేడీఎస్ అధినేత ఆలయాల సందర్శన
హైదరాబాద్: కర్ణాటక రాజకీయ పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించారు. కర్ణాటక శాసనసభలో బీజేపీ బలపరీక్షలో నెగ్గకుండా జేడీఎస్ అధినేత కుమారస్వామి వ్యూహాత్మకంగా వ్యవహరించి దేశంలో ప్రాంతీయ పార్టీ సత్తా చాటారని కితాబిచ్చారు. తాము కొత్తగా ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భావానికి జేడీఎస్ విజయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.
కాగా, కర్ణాటకలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ముందే పలు దేవాలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్య నేతృత్వంలో నియమించిన సమన్వయ కమిటీ ఆదివారం సమావేశం అవుతోంది. దీనికి కుమారస్వామి హాజరవుతారు.

అనంతరం తన వర్గం ఎమ్మెల్యేలను ఉంచిన హోటల్కు వెళ్లి వారితో కాసేపు మాట్లాడుతారు. అనంతరం తన సోదరుడు రేవణ్ణతో కలసి తమిళనాడుకు బయలుదేరుతారు. తిరుచ్చి చేరుకుని శ్రీరంగం ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కుమారస్వామి తిరుమలకు వెళ్తారని జేడీఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, తన ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఆహ్వానించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో తిరుమల పర్యటన ఉంటుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications