కెసిఆర్ పాలసీ: చీప్ లిక్కర్పై మాట్లాడతానన్న కూతురు కవిత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న చీప్ లిక్కర్ విషయమై ఆమె స్పందించారు.
ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన తర్వాత తాను చీప్ లిక్కర్ పైన మాట్లాడుతానని చెప్పారు. తమ సంస్థ జాగృతి గుడుంబా పైన పోరాటం చేస్తామని చెప్పారు. గుడుంబా వల్ల ఎక్కువ మంది మహిళలే నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుడుంబాను నియంత్రించేందుకే చీప్ లిక్కర్ అన్నారు.
కాగా, ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకటించాక తాను స్పందిస్తానని కవిత చెప్పడం గమనార్హం. పాలసీ నచ్చకుంటే ఆమె ఏం చేస్తారు? అయితే, ప్రభుత్వం పాలసీని ఆమె సమర్థించే అవకాశాలు కొట్టిపారేయలేమని చాలామంది భావిస్తున్నారు.

దళితులకు 3,600 ఎకరాలు కొనిచ్చాం: రామ్ లక్ష్మణ్
దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల కోసం మంచి పథకాన్ని ప్రవేశపెట్టిందని ప్రభుత్వ సలహాదారు రామ్ లక్ష్మణ్ మంగళవారం అన్నారు. దళితులకు ప్రభుత్వం ఇప్పటి వరకు 3,600 ఎకరాల భూమిని కొనిచ్చిందన్నారు.
దేశంలో ఎక్కడా కూడా దళితుల కోసం భూమిని కొని పంచడంలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఎకానమిక్ సపోర్ట్ స్కీంలో ఎస్సీ, ఎస్టీలకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నామని, సంవత్సర కాలంలో దళితుల అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications