రెండో స్థానంలో తెలంగాణ, ప్రయత్నించడం లేదు: కెసిఆర్ ప్రభుత్వంపై కోదండరామ్
న్యూఢిల్లీ: తెలంగాణలో రైతు ఆత్మహత్యలన్నింటికీ గత ప్రభుత్వాల ప్రభావమే కారణమని తెలంగాణ జెఎసి చైర్మ న్ కోదండరామ్ అన్నారు. రైతుల ఆత్మహత్యల నిరోధానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రయత్నించడం లేదని ఆయన అన్నారు.
ఢిల్లీలో ఆల్ అస్సాం విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారంనాడు నిర్వహించిన చిన్న రాష్ట్రాల సదస్సులో ఆయన ప్రసంగించారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని, విదర్భ తర్వాత తెలంగాణలోనే ఎక్కువ రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఆత్మహత్యల నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరగడంలేదనే వాదనలో నిజం లేదని, నిరుడు 800 మంది రైతులు చనిపోయారని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని ఆయన అన్నారు. దేశంలో మరిన్ని చిన్న రాష్ట్రాలు రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏర్పడే చిన్న రాష్ట్రాలకు తెలంగాణ సమాజం మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.
కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ను కేంద్ర కార్మిక శాఖ సహయ మంత్రి దత్తాత్రేయ, కోదండరామ్ మంగళవారం కలిశారు. వారితోపాటు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు కూడా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటుచేయాలని వారు వినతిప్రతం సమర్పించారు. హైకోర్టును తక్షణమే విభజించాలని ఆయన రాజ్నాథ్ సింగ్ను కోరారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications