రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగిన కేసీఆర్: ఓటమితోనే ఆగిన.. లేదంటే సగం దేశంలో మంటే!
కరీంనగర్: భూమి, ఆకాశం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ తెలంగాణ బలం.. తెలంగాణ గళం అని వ్యాఖ్యానించారు. కరీంనగర్ కదనభేరీతో లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సర్కారు కరెంట్, రైతుబంధు ఇవ్వలేకపోతోందని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీని గెలిపించుకోవాలన్నారు కేసీఆర్. రైతుల దయనీయ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. పంటలు ఎండిపోతున్నా.. పాలకులకు దయరావట్లేదని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. మూడు నెలల్లోనే పాలకులు రాష్ట్రాన్ని ఆగం చేరశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిస్తోందన్నారు.

ఆశకు పోయి కాంగ్రెస్ను గెలిపిస్తే గ్యారంటీల అమలు వదిలి దిల్లీకి సూట్కేసులు మోస్తున్నారని విమర్శించారు. అహోరాత్రులు కష్టపడి ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, రెప్పపాటు పోకుండా కరెంట్ ఇచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. మరోసారి కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధు, కరెంట్, నీళ్లు ఇవ్వకపోయినా మద్దతిచ్చినట్లువుతుందని హెచ్చరించారు. కొందరు పార్టీ మారగానే బీఆర్ఎస్ పనైపోయిందనే ప్రచారం చేస్తున్నారన్న కేసీఆర్.. భూమి ఆకాశాలు ఉన్నంతకాలం పార్టీ ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ సర్కారు కరెంట్, రైతుబంధు ఇవ్వలేకపోతోందని కేసీఆర్ విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్ల కింద ఇసుక జారిపోతే బ్రహ్మాండం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. 'కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ బ్యారేజ్ వంద కాంపోనెంట్లలో అదొక చిన్న పిల్లర్. దానికింద ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగాయి. ఎంతసేపు కేసీఆర్ను బద్నాం చేయాలని చూస్తున్నారు కానీ తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించటంలేదు. ఇంకా వాటిపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారు తప్ప రైతుల వ్యథను పట్టించుకోవటం లేదు' అని కేసీఆర్.. రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
టీవీ ముందుకి నేనే వస్తా..
— BRS Party (@BRSparty) March 12, 2024
కాళేశ్వరం అంటే ఏందో ప్రతీ ఇంటికీ చేరేలా చెప్తా.
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/9AyuGvhDEo
తాను అధికారం దిగిపోగానే రాష్ట్రంలో కరెంట్, రైతు బంధు బంద్ అయ్యాయన్నారు కేసీఆర్. పోలీసులకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించిన కేసీఆర్.. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో చిచ్చు పెట్టొద్దని, మేం అలా చేస్తే కాంగ్రెసోళ్లు మిగిలేవారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక పన్ను వదులైతే మొత్తం రాలగొట్టుకుంటామా. ప్రశ్నించారు. ఒకటి, రెండు రోజుల్లో టీవీలోకి వచ్చి, కాళేశ్వరంపై వివరిస్తానని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తుకు ఎత్తిన గడ్డ కరీంనగర్ గడ్డ
— BRS Party (@BRSparty) March 12, 2024
- బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ pic.twitter.com/Yayfyp4cpg
సీఎం రేవంత్ రెడ్డిని ఆరు గ్యారంటీలు అడిగితే..చెప్పులతో కొడతా.. పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, మానవ బాంబు అవుతా అంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో తానూ పరుషంగా మాట్లాడాననీ.. కానీ, సీఎం అయిన తర్వాత అలా మాట్లాడలేదని తెలిపారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆగిపోయానని.. లేదంటే సగం దేశంలో మంట రగిల్చేవాడనని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ప్రజా తీర్పుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
గుండెల నిండా జై తెలంగాణ అనేది ఒక్క గులాబీ జెండా మాత్రమే ✊
— BRS Party (@BRSparty) March 12, 2024
- బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ pic.twitter.com/owyZNATMZL
తమాషాకు ఓటేయొద్దు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ నేతలు బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. తెలంగాణకు ప్రధాని మోడీ, కరీంనగర్కు బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ను గెలిపించాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications