కేసీఆర్పై టీడీపీ, 'గొర్రెలతో ఎన్టీఆర్ భవన్ ముట్టడి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నేతలకు శిక్షణ తరగతుల కంటే ముందు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మానసిక వైద్య పరీక్షలు చేయించి పరిపాలన సంబంధ అంశాలపై శిక్షణ ఇప్పించాలని టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి శనివారం అన్నారు. రాజ్యాంగబద్దంగా పాలించవలసిన కేసీఆర్ రాచరిక పోకడల ద్వారా పాలిస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు వ్యాఖ్యల దుమారం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు యాదవులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ హైదరాబాద్ నగర యావద సంఘం నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

పంజాగుట్ట కూడలిలో బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చంద్రబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోపిడీకి గురి చేసిన చంద్రబాబు నేడు అహంకారపూరితంగా యాదవులను కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు.
లక్ష గొర్రెలతో ఎన్టీఆర్ భవన్ ముట్టడి: ఆంజనేయ గౌడ్
ఎన్నికల ముందు పాదయాత్ర, సభల్లో గొంగడి కప్పుకొని, గొర్రెపిల్లను ఎత్తుకొని మీడియాకు పోజులు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు యాదవ కులవృత్తిని అవమానపర్చడం విడ్డూరమని తెలంగాణ బీసీ ఫోరం అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ విమర్శించారు. యాదవులకు క్షమాపణ చెప్పకుంటే లక్ష గొర్రెలు, మేకలతో ఎన్టీఆర్ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications