స్వచ్ఛ హైదరాబాద్ నిరంతరం: కెసిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. స్వచ్ఛ హైదరాబాద్ను కేవలం 4 రోజులకే పరిమితం చేయకుండా ప్రతి నెలా ఒక రోజు చేపట్టనున్నట్టు ప్రకటించారు.
మే 16నుంచి 20వరకు నాలుగు రోజులు నిర్వహించే స్వచ్ఛ హైదరాబాద్లో ప్రజల నుంచి వచ్చే వినతులపై చర్చించి పరిష్కరించేందుకు 26న మరోసారి ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నట్టు వెల్లడించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సహా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
కెసిఆర్ సమీక్ష
ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.
కెసిఆర్ సమీక్ష
స్వచ్ఛ హైదరాబాద్ను కేవలం 4 రోజులకే పరిమితం చేయకుండా ప్రతి నెలా ఒక రోజు చేపట్టనున్నట్టు ప్రకటించారు.
కెసిఆర్ సమీక్ష
మే 16నుంచి 20వరకు నాలుగు రోజులు నిర్వహించే స్వచ్ఛ హైదరాబాద్లో ప్రజల నుంచి వచ్చే వినతులపై చర్చించి పరిష్కరించేందుకు 26న మరోసారి ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నట్టు వెల్లడించారు.
కెసిఆర్ సమీక్ష
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సహా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్ను 425 భాగాలుగా విభజించి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, ఆర్మీ సహా అన్ని వర్గాలకు చెందినవారూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
కెసిఆర్ సమీక్ష
కార్యక్రమం పర్యవేక్షణకు ప్రతి బృందానికీ సీనియర్ సివిల్ సర్వెంట్ ఒకరు ప్రేరకునిగా వ్యవహరిస్తారన్నారు.
కెసిఆర్ సమీక్ష
ఒక్కో బస్తీలో దాదాపు 6వేల మంది వలంటీర్లు పర్యటించి ప్రజలతో మమేకం కానున్నారని ముఖ్యమంత్రి వివరించారు.
కెసిఆర్ సమీక్ష
స్వచ్ఛ హైదరాబాద్ అంటే కేవలం చెత్త ఏరివేతకు పరిమితం కాకుండా, ఆయా బస్తీల్లోని ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని సూచించారు.
కెసిఆర్ సమీక్ష
తక్షణం పరిష్కరించాల్సిన సమస్యల కోసం ప్రతి బస్తీకి రూ.50 లక్షల చొప్పున నిధులు మంజురు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
కెసిఆర్ సమీక్ష
బస్తీలవారీగా సేకరించిన సమాచారంతో నియోజకవర్గాల వారిగా క్రోడికరించి, బుక్లెట్ తయారు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.
కెసిఆర్ సమీక్ష
దాని ఆధారంగా మే 26న నగర ప్రజా ప్రతినిధులతో మరోసారి సమావేశమై తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై చర్చిస్తామన్నారు.
కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్ను స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు అందరిపై ఉందని సిఎం సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్ ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజాకార్యక్రమంగా మలచాలని పిలుపునిచ్చారు.
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని స్వచ్ఛ హైదరాబాద్ను విజయవంతం చేస్తే దేశంలో మనమే నంబర్ వన్ అవుతామని కేంద్ర మంత్రి బండారు దతాత్రేయ అన్నారు.