వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక రైతులకు ఉచిత బీమా: ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామన్న సీఎం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రైతులకు ఇక బీమా పథకం అమలు కానుంది. శుక్రవారం రైతు బీమా పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పథకంపై ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ఆగస్టు 15న రైతులకు జీవిత బీమా పథకం ప్రారంభం కానుందన్నారు. దీనికోసం రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఎల్‌ఐసీతో ఒప్పందం ద్వారా రైతు బీమా పథకం అమలు చేస్తామన్నారు.

KCR reviews on farmers insurance scheme

రైతు ఏకారణంతో మరణించినా బీమా వర్తిస్తుందని సీఎం తెలిపారు. రైతు బీమాకు సంబంధించి మొత్తం ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. సాధారణ మరణమైనప్పటికీ నామినీకి 10 రోజుల్లోగా రూ. 5 లక్షల బీమా చెల్లిస్తామన్నారు.

18ఏళ్ల నుంచి 59 ఏండ్ల లోపు రైతులకు బీమా వర్తిస్తుందని సీఎం తెలిపారు. ఎల్‌ఐసీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం ఆకాంక్షించారు. దేశ చరిత్రలో రైతులకు బీమా సరికొత్త రికార్డు అని ఎల్‌ఐసీ అధికారులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Friday reviewed on farmers insurance scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X