అలాంటి తెలంగాణకు.. ఇలాంటి దుస్థితి ఎందుకు?: రేవంత్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
సూర్యాపేట: దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్పకాలంలోనే ఎందుకు ఈ దుస్థితి వచ్చిందని ప్రశ్నించారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో పర్యటించిన అనంతరం సూర్యాపేటలో నిర్వహించిన ప్రెస్మీట్ ఆయన మాట్లాడారు. రైతుల దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని అన్నారు.
కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణలో రైతులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరూ ఆలోచించుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు బ్రహ్మాండంగా పంటలను సాగుచేసుకున్నారని, కానీ అనతికాలంలోనే ఇంతర దుర్భర పరిస్థితి వస్తదని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్ప కాలంలోనే ఈ దుస్థితికి ఎందుకు రావాలి? నీళ్లిస్తారని నమ్మి పంటలు వేసుకున్నాం. ముందు చెబితే వేసుకునేవాళ్లం కాదని రైతులు చెబుతున్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు అనుకూల విధానాలు చేపట్టింది. రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం అందించామని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయం అద్భుతమైన దశకు వెళ్లింది. పండిన ప్రతి గింజ కొన్నాం. ధాన్యం దిగుబడిలో పంజాబ్ను దాటేశామన్నారు.
అంతేగాక, అనతికాలంలోనే దేశంలోనే అగ్రస్థానానికి దూసుకుపోయింది. ఇది కట్టుకథ కాదు, పిట్టకథ కాదు, వాస్తవం. మరి ఇంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు ఇంత అధ్వాన్నంగా మారడానికి కారణం ఎవరు..? లోపం ఎక్కడుంది? ఈ విషయంపై ప్రజలతోపాటు జర్నలిస్టు మిత్రులు కూడా బాగా ఆలోచన చేయాలి' అని కేసీఆర్ సూచించారు. వరి పంటకు రూ. 500 బోనస్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత తొందరగా కేవలం 100 రోజులలోపే రైతులకు ఇంత దుర్భర పరిస్థితి వస్తదని అనుకోలేదు. కేవలం 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మేం రైతులకు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టినా ఈ దుస్థితి ఎందుకొచ్చింది? దేశంలోనే ఉత్పత్తిలో నంబర్ వన్ స్థాయికి ఎదిగిన రాష్ట్రం అనతికాలంలో ఈ స్థాయికి ఎందుకు దిగజారిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇంటికో నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రంలో తాగునీటికి కరువు ఎందుకొచ్చినట్టు..? మా టైమ్లో బ్రహ్మాండంగా తాగునీటి సరఫరా జరిగింది. ఎక్కడా నీళ్ల ట్యాంకర్లు కనపడలే. ఏ ఆడ బిడ్డ కూడా వీధుల్లో బింద పట్టుకుని కనపడలే. కానీ, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసే దుస్థితి ఎందుకొచ్చింది?' అని కేసీఆర్ నిలదీశారు. తాము హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చామన్నారు. రాత్రింబవళ్లు కొట్లాడి నేషనల్ పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేయించామన్నారు. 24 గంటలపాటు కరెంట్ ఇచ్చామని
చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులకు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. మరోవైపు, కాంగ్రెస్ హయాంలో పోలీసులు ప్రజలపట్ల, ప్రతిపక్ష పార్టీ శ్రేణులపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఈ దురుసు ప్రవర్తనను తగ్గించుకోవాలని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికార పార్టీ కోసం దురుసుగా ప్రవర్తించడం సబబు కాదని కేసీఆర్ హితవు పలికారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications