కెసిఆర్కు స్వల్పంగా జ్వరం: అపాయింట్మెంట్స్ రద్దు, ఎకె ఖాన్తో భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో విశ్రాంతి తీసుకునేందుకుగాను ఆయన మంగళవారంనాటి అపాయింట్మెంట్లన్నీ రద్దు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) ప్రకటించింది.
ఇదిలావుంటే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాససనసభ్యుడు రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో జ్వరంతో బాధపడుతూ కూడా కెసిఆర్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డీజీ ఏకే ఖాన్తో సమావేశమయ్యారు.
తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్ బెంచ్ మార్పు కోసం వేసిన పిటిషన్ను కొట్టేయడమే కాకుండా కోర్టు దిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అంతేకాకుండా, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మత్తయ్య వ్యవహారాలు కూడా చిక్కుముడి వేసినట్లుగా ఉన్నాయి.
నోటుకు ఓటు కేసులో ఎలా ముందుకు సాగాలనే విషయంపై కెసిఆర్, ఖాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కేసు పురోగతిని ఖాన్ కెసిఆర్కు వివరించారని అంటున్నారు.