వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళకు భారీ విరాళం: రూ.25కోట్లు ప్రకటించిన తెలంగాణ, 2.5కోట్ల విలువైన పరికరాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు అండగా నిలిచేందుకు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా తెలంగాణా ప్రభుత్వం భారీ విరాళాన్ని ప్రకటించింది.

ఈ మేరకు తెలంగాణా ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతున్న కేరళ సోదర సోదరీమణులను అదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకొచ్చారని తెలిపారు.

25కోట్ల రూపాయల భారీ విరాళంతోపాటు, రూ.2.5కోట్ల విలువైన 10 రివర్స్‌ ఓస్మోసిస్ ప్లాంట్లను కేరళకు అందిస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు.
అలాగే కేరళ వరద పరిస్థితిపై సీఎం పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

మరోవైపు కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధికి తమ ప్రభుత్వం తరపున 10 కోట్ల రూపాయల విరాళం అందజేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ మీడియాకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా రూ.5కోట్ల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
Telangana minister KTR on Friday said that to aid & assist our brothers & sisters of Kerala in their hour of grief, Telangana CM KCR has just announced assistance of Rs. 25 Cr & 10 reverse osmosis plants worth 2.5 Cr towards the flood hit Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X