కేరళకు భారీ విరాళం: రూ.25కోట్లు ప్రకటించిన తెలంగాణ, 2.5కోట్ల విలువైన పరికరాలు
హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు అండగా నిలిచేందుకు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా తెలంగాణా ప్రభుత్వం భారీ విరాళాన్ని ప్రకటించింది.
ఈ మేరకు తెలంగాణా ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతున్న కేరళ సోదర సోదరీమణులను అదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకొచ్చారని తెలిపారు.
25కోట్ల
రూపాయల
భారీ
విరాళంతోపాటు,
రూ.2.5కోట్ల
విలువైన
10
రివర్స్
ఓస్మోసిస్
ప్లాంట్లను
కేరళకు
అందిస్తున్నట్టు
ప్రకటించారని
తెలిపారు.
అలాగే
కేరళ
వరద
పరిస్థితిపై
సీఎం
పినరయి
విజయన్తో
ఫోన్లో
మాట్లాడినట్లు
తెలిపారు.
మరోవైపు కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధికి తమ ప్రభుత్వం తరపున 10 కోట్ల రూపాయల విరాళం అందజేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా రూ.5కోట్ల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.