వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌రెడ్డి, ఖల్లాస్ కేసీఆర్: ట్విట్టర్‌లో ట్రెండింగ్, ఏం చేశారంటూ ప్రశ్నల వర్షం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. పలు సర్వేలు తెరాస గెలుస్తుందని, మరికొన్నిసర్వేలు మహాకూటమి గెలుస్తుందని చెబుతున్నాయి. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం మరోలా ఉంది. ఓటింగ్ పెరిగితే కూటమికి అవకాశం, తగ్గితో హంగ్ అని చెప్పారు.

<strong>ఏ ఆధారాలతో రేవంత్ అరెస్ట్, బంద్ తప్పేంటి: ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం, విడుదలచేయండి.. డీజీపీకి సీఈవో</strong>ఏ ఆధారాలతో రేవంత్ అరెస్ట్, బంద్ తప్పేంటి: ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం, విడుదలచేయండి.. డీజీపీకి సీఈవో

లగడపాటి సర్వేపై తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు దీనిని స్వాగతిస్తున్నారు. రెండు రోజులుగా ట్విట్టర్ అకౌంట్‌లో రేవంత్ రెడ్డి, కొడంగల్, కేసీఆర్ పేరు టాప్ ట్రెండింగ్స్‌లో ఉంది. మంగళవారం రేవంత్ అరెస్టు నేపథ్యంలో కొడంగల్, రేవంత్ పేరు ట్రెండ్స్‌లో ఉంది.

ఖల్లాస్ కేసీఆర్

ఖల్లాస్ కేసీఆర్

ఆ తర్వాత నుంచి కేసీఆర్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో 'ఖల్లాస్ కేసీఆర్' (#KhallasKCR) అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఖల్లాస్ కేసీఆర్ అనేది టాప్ త్రీ ట్రెండింగ్‌లోకి కూడా వచ్చింది. ఖల్లాస్ కేసీఆర్ అనే పేరుతో ఆయన 2014లో ఇచ్చిన హామీలను, అమలు చేయని వాటిని పోస్ట్ చేస్తున్నారు.

 తెలంగాణ దొంగలతో దోస్తీ అంటూ

తెలంగాణ దొంగలతో దోస్తీ అంటూ

తెలంగాణ దొంగలతో దోస్తీ కట్టి దోచుకున్నందుకు మళ్లీ గెలిపించాలా అని ఒకరు పోస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన చాలామంది నేతలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారిని కేబినెట్లోకి కూడా తీసుకున్నారు. ఇది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కాంట్రాక్టులు కూడా ఆంధ్రావాళ్లకు కట్టబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆ పోస్ట్ చేశారని తెలుస్తోంది.

స్వేచ్ఛగా బతుకుదామని చెప్పి సంకెళ్లు

స్వేచ్ఛగా బతుకుదామని చెప్పి సంకెళ్లు

మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశావని, మళ్లీ మీ దొరల పాలన ఎందుకు అని మరొకరు ట్వీట్ చేశారు. స్వేచ్ఛగా బతుకుదామని చెప్పి గళానికి.. కళానికి సంకెళ్లు వేశావని పోస్ట్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తివేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇంటింటికి నల్లాపై విమర్శలు

ఇంటింటికి నల్లాపై విమర్శలు

ఇంటింటికి నల్లా నీళ్లు.. ఏ ఇంటిలోను కనిపించదే అంటూ ఇంకొకరు పోస్ట్ చేశారు. తాను ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చిన తర్వాతే ఓటు అడుగుతానని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. కానీ ఆ హామీ ఎక్కడ నెరవేరిందని ప్రశ్నిస్తున్నారు. కోటి రత్నాల తెలంగాణను 2 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఖల్సాస్ కేసీఆర్ అని ట్విట్టర్‌లో ఇవి ట్రెండ్ అవుతున్నాయి. కేసీఆర్ నియోజకవర్గం గజ్వెల్‌లో కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ర్యాలీకి పెద్ద ఎత్తున వచ్చిన జనాలకు సంబంధించిన ఫోటోను మరొకరు పోస్ట్ చేశారు. దీనిని చూస్తుంటే కేసీఆర్ ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని పేర్కొన్నారు

English summary
'More than 4000 farmers have committed sucide in Telangana in the past 5 years.' one netizen tweeted with KhallasKCR hashtag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X