కేసీఆర్ కంటే కిరణ్ కుమార్ రెడ్డి బెట్టర్: దాసోజు శ్రవణ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కంటే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులు కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు చాలా బెట్టర్ అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ బుధవారం అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కంటే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులు కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు చాలా బెట్టర్ అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ బుధవారం అన్నారు.
కేసీఆర్తో పోల్చితే వారు ఎంతో మేలు అనిపిస్తోందన్నారు. తెలంగాణలో ఉద్యోగాల నియామకాల విషయంలో కేసీఆర్ సర్కార్ చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ జేఏసీ చైర్మన్ కోదండరాం తన ఇంటివద్ద ఒక్కరోజు దీక్ష చేప్టటిన విషయం ప్రస్తావించారు.

కోదండరామ్ ఏమైనా నక్సలైటా? ఆయన దీక్షకు ఎందుకు అనుమతివ్వడం లేదని శ్రవణ్ నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జేఏసీ రాజకీయంగా బలపడాలని, రాజకీయంగా కోదండరాం ఎదగాలన్నారు.












Click it and Unblock the Notifications