భూసేకరణలో దౌర్జన్యాలు : కోదండరాం సంచలన కామెంట్
హైదరాబాద్ : నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి.. ప్రజాభిప్రాయాన్ని, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టాలని గత కొంతకాలంగా ప్రొఫెసర్ కోదండరాం తన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయమై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమావేశం సందర్భంగా మాట్లాడిన ఆయన.. భూసేకరణలో దౌర్జన్యాలు జరుగుతున్నాయన్న విషయం దృష్టికి వచ్చిందని సంచలన కామెంట్ చేశారు. ఇకపోతే, ముంపు బాధితుల హక్కులను పరిరక్షించాలని చెప్పిన కోదండరాం, ప్రాజెక్టు నిర్మాణం కోసం నీటి పారుదల నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సమావేశానికి హాజరైన మరో ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. పంథాలకు పోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన హరగోపాల్, ప్రజా ప్రయోజనాలను దృష్టి ఉంచుకుని ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు.
రిజర్వాయర్ అనవసరం :
సాగు కాలమంతా నీరు లభ్యమయ్యే అవకాశమున్నప్పుడు రిజర్వాయర్ నిర్మించాల్సిన అవసరం లేదన్నారు నీటి పారుదల రంగ నిపుణుడు హనుమంతరావు. మల్లన్న సాగర్ కట్టి తీరుతామంటున్న ప్రభుత్వం పంథాలకు పోవడం సరికాదని సూచించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications