కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం..
తెలంగాణలో జరిగే ప్రసిద్ధమైన జాతరల్లో కొమురవెల్లి మల్లన్న స్వామి జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది అచ్చ జానపదుల జాతర. సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారం(జనవరి 18) నాడు మల్లన్న జాతర.. కల్యాణోత్సవం, శకటోత్సవాలతో ప్రారంభమవుతుంది. సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారంతో ప్రతి సంవత్సరం ఆరంభమయ్యే జాతర మూడు నెలలపాటు ప్రతి ఆదివారం జరుగుతుంది. ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముగుస్తుంది. బోనాలు, అగ్నిగుండాలు వంటి వేడుకలతో జానపదులు స్వామిని మెప్పిస్తారు. ఈ కొమురవెల్లి క్షేత్రం సిద్దిపేట జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడ మల్లన్నను శివుని అవతారంగా కొలుస్తారు. అంతేకాదు మల్లన్న శివుని కొడుకు అని.. ఎల్లమ్మకు తమ్ముడు అని మల్లన్న కథలో వస్తుంది. మల్లన్న బోనంలో బెల్లం, బియ్యం సమర్పిస్తారు. బలి సమర్పణలు ఈ ఆలయంలో ఉండవు. మల్లన్న సంప్రదాయంలో పూజ అంతా కూడా తెలుగు సంప్రదాయం ప్రకారం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో కొలిచిన వారిని మల్లిఖార్జున స్వామి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. ఇక కొమురవెల్లి జాతర ఉగాది వరకూ కొనసాగుతుంది. అలాగే మహా శివరాత్రి రోజుల్లో అగ్నిగుండం కూడా ఉంటుంది.

ఇక ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. హైదరాబాద్ నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. అందుకే తొలి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తుంటారు. అలాగే, సోమవారం తోటబావి సమీపంలోని కల్యాణ వేదిక దగ్గర సొంత ఖర్చులతో పట్నం, అగ్నిగుండం కార్యక్రమాలు జరుపుతారు. ఈ వేడుకకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఆలయానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications