Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం..

తెలంగాణలో జరిగే ప్రసిద్ధమైన జాతరల్లో కొమురవెల్లి మల్లన్న స్వామి జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది అచ్చ జానపదుల జాతర. సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారం(జనవరి 18) నాడు మల్లన్న జాతర.. కల్యాణోత్సవం, శకటోత్సవాలతో ప్రారంభమవుతుంది. సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారంతో ప్రతి సంవత్సరం ఆరంభమయ్యే జాతర మూడు నెలలపాటు ప్రతి ఆదివారం జరుగుతుంది. ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముగుస్తుంది. బోనాలు, అగ్నిగుండాలు వంటి వేడుకలతో జానపదులు స్వామిని మెప్పిస్తారు. ఈ కొమురవెల్లి క్షేత్రం సిద్దిపేట జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇక్కడ మల్లన్నను శివుని అవతారంగా కొలుస్తారు. అంతేకాదు మల్లన్న శివుని కొడుకు అని.. ఎల్లమ్మకు తమ్ముడు అని మల్లన్న కథలో వస్తుంది. మల్లన్న బోనంలో బెల్లం, బియ్యం సమర్పిస్తారు. బలి సమర్పణలు ఈ ఆలయంలో ఉండవు. మల్లన్న సంప్రదాయంలో పూజ అంతా కూడా తెలుగు సంప్రదాయం ప్రకారం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో కొలిచిన వారిని మల్లిఖార్జున స్వామి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. ఇక కొమురవెల్లి జాతర ఉగాది వరకూ కొనసాగుతుంది. అలాగే మహా శివరాత్రి రోజుల్లో అగ్నిగుండం కూడా ఉంటుంది.

Komuravelli Mallikarjuna Swamy Brahmotsavams Kick Off Today with Grand Devotion

ఇక ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. హైదరాబాద్‌ నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. అందుకే తొలి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తుంటారు. అలాగే, సోమవారం తోటబావి సమీపంలోని కల్యాణ వేదిక దగ్గర సొంత ఖర్చులతో పట్నం, అగ్నిగుండం కార్యక్రమాలు జరుపుతారు. ఈ వేడుకకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఆలయానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+