కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం..చండీయాగం, సుదర్శన యాగాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కొండపోచమ్మ రిజర్వాయర్ ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కష్ట కాలంలోనూ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఇక నేడు తెలంగాణలో మరో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు ఈరోజు కొండపోచమ్మ జలాశయంలోకి చేరుతున్న సందర్భంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ సతీసమేతంగా విచ్చేసారు.
Recommended Video

కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం వేళ యాగాలలో పాల్గొంటున్న కేసీఆర్ దంపతులు
ఇక ఈ సందర్భంగా జరుగుతున్న యాగాలలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటున్నారు. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభం అవుతున్నవేళ ఈరోజు తెల్లవారుజాము నుండే కొండ పోచమ్మ దేవాలయంలో యాగాలు మొదలయ్యాయి. కొండ పోచమ్మ దేవాలయంలో ఈరోజు ఉదయం 4 గంటల 30 నిమిషాల నుండి నవ చండీ యాగం ప్రారంభం కాగా కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ వద్ద సుదర్శన యాగం జరగనుంది.

సతీసమేతంగా చండీయాగంలో పాల్గొన్న కేసీఆర్
సీఎం కేసీఆర్సతీసమేతంగా కొండపోచమ్మ దేవాలయం వద్దకు చేరుకొని చండీయాగంలో పాల్గొన్నారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. దేవాలయంలో చండీయాగం అనంతరం కేసీఆర్అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సిఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

పంప్ హౌజ్ వద్ద సుదర్శనయాగం .. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం
ఆ తరువాతమర్కూక్ వద్ద గలకొండ పోచమ్మ సాగర్ కు నీటిని లిఫ్టు చేసే పంపు హౌజు వద్దకు చేరుకుంటారు. పది గంటల సమయంలో పంపుహౌజు వద్దకు చేరుకునే చినజీయర్ స్వామికి కేసీఆర్ స్వాగతం పలికి అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొననున్నారు సీఎం దంపతులు. ఉదయం 11:30 గంటలకు మర్కూక్ పంప్హౌస్ను ప్రారంభిస్తారు. ఉదయం 11:35 గంటలకు కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు హారతి ఇస్తారు. గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు.

ఐదు జిల్లాలకు వరప్రదాయినిగా కొండ పోచమ్మ రిజర్వాయర్
మధ్యాహ్నం 12 గంటలకు మర్కూక్ మండల కేంద్రంలోని వరదరాజస్వామి దేవాలయంలో సీఎం పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కెసిఆర్ సమావేశం నిర్వహించి వారితో మాట్లాడతారు.కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు వరప్రదాయినిగా మారనుంది. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ ఐదు జిల్లాల ప్రజల తాగునీటి సాగునీటి అవసరాలను తీర్చింది. ఇక ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ ను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications