వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాన్వి మృతికి సంతాపం: బోరుబావి యజమానిపై క్రిమినల్‌ కేసు పెట్టాలన్న కెటిఆర్

|
Google Oneindia TeluguNews

నల్గొండ/హైదరాబాద్: నల్గొండ జిల్లా శౌలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో బోరుబావిలో పడి మూడేళ్ల చిన్నారి శాన్వి మృతి చెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కెటి రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాన్వి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చాలని ఆదేశాలున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని నల్గొండ జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదేశాలు పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి శాన్వి మృతిబోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి శాన్వి మృతి

KTR condolences to Shanvi's death

నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోరుబావి యజమానిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని, ఉపాధి హామీ పనుల ద్వారా నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చాలని ఆదేశించారు.

కాగా, నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆడుకుంటూ బోరుబావిలో పడింది శాన్వి(3). ఆ చిన్నారి మృతదేహాన్ని మంగళవారం బయటికి తీశారు. చిన్నారి మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

English summary
Telangana Minister KT Rama Rao on Tuesday expressed his condolences to Shanvi's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X