గేమింగ్ సిటీగానూ హైదరాబాద్: ఐటి కంపెనీని ప్రారంభించిన కెటిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: గేమింగ్ సిటీ ఏర్పాటులో భాగంగా వచ్చే నెల మొదటివారంలో గేమింగ్ టవర్కు శంకుస్థాపన చేయనున్నామని ఐటిశాఖ మంత్రి కెటి రామారావు చెప్పారు. ఐటీ రంగాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని అన్నారు. సోమవారం మాదాపూర్లో లాంచ్షిప్ సాఫ్ట్వేర్ కొత్త కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
ఇదే కార్యక్రమంలో హర్కుల్స్న్, టిఆర్ఎస్ ఫోన్డైరీ యాప్లను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగులతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం ఐటీరంగంలో అడ్వాన్స్డ్ స్టేజ్ ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో రెండో స్థానంలో ఉన్నామని, మొదటిస్థానం సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ దిశగా టీహబ్ను ఇటీవల లాంచ్ చేశామని గుర్తు చేశారు.
ఇక్కడ ఐడియాతో వెళ్లి ప్రొడక్ట్తో తిరిగి రావచ్చునని ఆయన తెలిపారు. టీహబ్ను విస్తరించబోతున్నామని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం గేమింగ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గేమింగ్ జోన్ను అభివృద్ధి పరచాలని నిర్ణయించామని ఆయన అన్నారు.

మంత్రి కెటిఆర్
గేమింగ్ సిటీ ఏర్పాటులో భాగంగా వచ్చే నెల మొదటివారంలో గేమింగ్ టవర్కు శంకుస్థాపన చేయనున్నామని ఐటిశాఖ మంత్రి కెటి రామారావు చెప్పారు.

మంత్రి కెటిఆర్
ఐటీ రంగాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని అన్నారు. సోమవారం మాదాపూర్లో లాంచ్షిప్ సాఫ్ట్వేర్ కొత్త కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

మంత్రి కెటిఆర్
ఇదే కార్యక్రమంలో హర్కుల్స్న్, టిఆర్ఎస్ ఫోన్డైరీ యాప్లను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగులతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం ఐటీరంగంలో అడ్వాన్స్డ్ స్టేజ్ ఉందన్నారు.

మంత్రి కెటిఆర్
ప్రస్తుతం దేశంలో రెండో స్థానంలో ఉన్నామని, మొదటిస్థానం సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ దిశగా టీహబ్ను ఇటీవల లాంచ్ చేశామని గుర్తు చేశారు.

మంత్రి కెటిఆర్
ఇక్కడ ఐడియాతో వెళ్లి ప్రొడక్ట్తో తిరిగి రావచ్చునని ఆయన తెలిపారు. టీహబ్ను విస్తరించబోతున్నామని వెల్లడించారు.

మంత్రి కెటిఆర్
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం గేమింగ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గేమింగ్ జోన్ను అభివృద్ధి పరచాలని నిర్ణయించామని ఆయన అన్నారు.

మంత్రి కెటిఆర్
డిసెంబర్ మొదటివారంలో గేమింగ్ టవర్కు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. 10 ఎకరాల్లో 5లక్షల ఎస్ఎఫ్టీలో గేమింగ్ జోన్ను అభివృద్ధి చేస్తున్నామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక గేమింగ్ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు.
డిసెంబర్ మొదటివారంలో గేమింగ్ టవర్కు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. 10 ఎకరాల్లో 5లక్షల ఎస్ఎఫ్టీలో గేమింగ్ జోన్ను అభివృద్ధి చేస్తున్నామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక గేమింగ్ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు.
టీహబ్, గేమింగ్ టవర్లకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. ఇలాంటి అవకాశాలు లేకపోవడం వల్ల గతంలో చాలా మంది విదేశాలకు వెళ్లారని పేర్కొన్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, వాట్సప్ లాంటి ఆవిష్కరణలు చాలా సాధారణమైన టెక్నాలజీతో రూపొందించారని అన్నారు.
ఇలాంటి ఐడియాతో వస్తే లీగల్, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ సపోర్టును టీహబ్ అందిస్తుందన్నారు. గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్కు మంచి భవిష్యత్తు ఉందని, దీన్ని అభివృద్ధి పర్చుకోవాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. ప్రధాన మంత్రి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అన్నారని.. దీన్ని తెలంగాణ సిఎం కెసిఆర్ ఆచరిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications