ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్: డీజీపీకి కేటీఆర్ ట్వీట్, అనురాగ్ చర్యలు, థ్యాంక్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా డీజీపీ అనురాగ్ శర్మను ప్రశ్నించారు. దీంతో వెంటనే సంబంధిత అంశం పైన డిజిపి చర్యలు తీసుకున్నారు.
ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది. రంగారెడ్డి జిల్లా మంచాల ఇన్స్పెక్టర్ గంగాధర్ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. రెండు రోజుల కిందట ఇండియన్ నేషనల్ ర్యాలీ సంస్థ చేపట్టిన బైక్ ర్యాలీని అనుమతి లేదంటూ గంగాధర్ అడ్డుకుని వారిపై చేయి చేసుకున్నారు.

ఈ విషయాన్ని నిర్వాహకులు కెటిఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ వ్యవహారంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫెండ్రీ పోలీస్ విధానంపై డిజిపిని ప్రశ్నించారు.
కెటిఆర్ ట్వీట్ పైన డిజిపి వెంటనే స్పందించారు. సదరు ఇన్స్పెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. డిజిపి ఆదేశాల మేరకు రాచకొండ కమిషనర్.. మంచాల ఇన్స్పెక్టర్ పైన క్రమశిక్షణలకు ఉపక్రమించారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన డీజీపీకి.. మంత్రి కృతజ్ఞతలు తెలపడం విశేషం. డిజిపికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications